కాశ్మీర్ లోని జరిగిన ఉగ్రదాడి ని భారత ప్రజలు త్వరగా మర్చిపోలేక పోతున్నారు.అంతటి మారణ హోమం తలపెట్టిన ఉద్రవాడులని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ పై తీవ్ర ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలాఉంటే ఉద్రదాడిలో మరణించిన వారి ఆత్మలు శాంతించేలా , వారి కుటుంభాలకి తగినంత సాయం చేయడానికి ప్రపంచ దేశాలలో ఉన్న ఎంతో మంది భారతీయులు ముందుకు వచ్చారు.
ఈ దాడి ఘటన జరిగిన మరుక్షణం చలించిపోయిన ప్రవాస భారతీయుడు వివేక్ పటేల్ భారీ మొత్తంలో విరాళాలు సేకరించారు.
గుజరాత్ లోని వడోదర వాస్తవ్యుడైన ఆయన ప్రస్తుతం అమెరికాలోని వర్జీనీయా రాష్ట్రంలో ఉంటున్నారు.జవాన్ల పై దాడి జరిగిన ఘటన తెలిసిన వెంటనే వారి వారి కుటుంభాలకి సహాయార్ధం సామాజిక మాధ్యమం వేదికగా.
ఫేస్బుక్ ఫండ్ రైజర్ ఫీచర్ను ను ఎంచుకుని గడిచిన 7 రోజుల కాలంలో ఆయన దాదాపు రూ.5.60 కోట్ల విరాళాలు కూడబెట్టారు.ఆ మొత్తాన్ని సీఆర్పీఎఫ్ సహాయ నిధికి బదిలీ చేసే ప్రయత్నాలలో కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది…ఇంత భారీ మొత్తంలో విరాళాలు అందించిన ప్రతీ ఒక్కరికీ వివేక్ కృతజ్ఞతలు తెలిపారు.