రేపే నీట్...

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌) యూజీ పరీక్ష ఆదివారం జరగనుంది.

దేశవ్యాప్తంగా నీట్‌కు 20,87,449 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు.

భారత్‌లో 499 నగరాలు, ఇతర దేశాల్లో 14 నగరాలు కలిపి మొత్తం 513 నగరాల్లో ఈ పరీక్షను నిర్వహిస్తారు.ఆదివారం మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు జరుగుతుంది.ఈనెల 3 నుంచి దరఖాస్తు చేసిన అభ్యర్థుల అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకుంటున్న విషయం తెలిసిందే.

తెలంగాణ నుంచి సుమారు 70 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసినట్టు సమాచారం.రాష్ట్రంలో 24 కేంద్రాల్లో ఈ పరీక్ష జరగనుంది.

Advertisement

Latest Hyderabad News