ఉప్పెనలో దూసుకుపోతున్న ఉప్పెన సాంగ్

మెగా ఫ్యామిలీ నుండి వస్తున్న కొత్త హీరో వైష్ణవ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఉప్పెన’ రిలీజ్‌కు ముందే తనదైన మార్క్‌ను వేసుకోవడంలో చాలా సక్సెస్ సాధించింది.

మెగా కాంపౌండ్ నుండి వస్తున్న వైష్ణవ్ తేజ్ నటిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉండగా, ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్న సంగీతంతో ఒక్కసారిగా పాపులారిటీ వచ్చి పడింది.

దీంతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి.ఇక ఉప్పెన సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్‌కు వచ్చిన క్రేజ్‌ను మరింత ఉపయోగించుకుంటూ దేవిశ్రీ ప్రసాద్ తనదైన మార్క్ ఇంప్రెషన్‌ను తీసుకొచ్చాడు.

‘నీ కన్ను నీలి సముద్రం’ అంటూ సాగిన ఈ సినిమా పాటకు తెలుగు శ్రోతలు నీరాజనాలు పట్టారు.దేవిశ్రీ అందించిన మెలోడియస్ మ్యూజిక్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.ఇక ఈ పాట యూట్యూబ్‌లో తన సెన్సేషన్‌ను క్రియేట్‌చేస్తూ దూసుకుపోతుంది.

Advertisement

ఇప్పటికే ఈ పాటకు ఏకంగా 50 మిలియన్ వ్యూస్‌ రాగా, దేవిశ్రీ సంగీతానికి ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు.ఇలాంటి పాటలే సినిమాలకు భవిష్యత్తు అంటూ పలువురు సంగీత ప్రేమికులు అంటుండటంతో ఈ సినిమా పాటలకు ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు.

ఇక సుకుమార్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాను బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తుండగా కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది.ఈ సినిమాను లాక్‌డౌన్ పూర్తయిన వెంటనే రిలీజ్ చేసేందుకు రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు