మెగా ఫ్యామిలీ నుండి వస్తున్న కొత్త హీరో వైష్ణవ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఉప్పెన’ రిలీజ్కు ముందే తనదైన మార్క్ను వేసుకోవడంలో చాలా సక్సెస్ సాధించింది.
మెగా కాంపౌండ్ నుండి వస్తున్న వైష్ణవ్ తేజ్ నటిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉండగా, ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్న సంగీతంతో ఒక్కసారిగా పాపులారిటీ వచ్చి పడింది.
దీంతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి.ఇక ఉప్పెన సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్కు వచ్చిన క్రేజ్ను మరింత ఉపయోగించుకుంటూ దేవిశ్రీ ప్రసాద్ తనదైన మార్క్ ఇంప్రెషన్ను తీసుకొచ్చాడు.
‘నీ కన్ను నీలి సముద్రం’ అంటూ సాగిన ఈ సినిమా పాటకు తెలుగు శ్రోతలు నీరాజనాలు పట్టారు.దేవిశ్రీ అందించిన మెలోడియస్ మ్యూజిక్కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.
దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.ఇక ఈ పాట యూట్యూబ్లో తన సెన్సేషన్ను క్రియేట్చేస్తూ దూసుకుపోతుంది.
ఇప్పటికే ఈ పాటకు ఏకంగా 50 మిలియన్ వ్యూస్ రాగా, దేవిశ్రీ సంగీతానికి ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు.ఇలాంటి పాటలే సినిమాలకు భవిష్యత్తు అంటూ పలువురు సంగీత ప్రేమికులు అంటుండటంతో ఈ సినిమా పాటలకు ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు.
ఇక సుకుమార్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాను బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తుండగా కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది.ఈ సినిమాను లాక్డౌన్ పూర్తయిన వెంటనే రిలీజ్ చేసేందుకు రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy