ఏలూరిపాడు అమ్మవారి ఆలయంలో సందడి చేసిన నరేష్ పవిత్ర.. ఫోటోలు వైరల్!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సీనియర్ నటుడు నరేష్(Naresh) నటి పవిత్ర లోకేష్(Pavitra Lokesh) ఒకరు.

పలు సినిమాలలో కలిసి జంటగా నటించిన ఈ సెలబ్రిటీలు నిజజీవితంలో కూడా రిలేషన్ లో ఉంటున్న విషయం మనకు తెలిసిందే.

ఇలా వీరిద్దరు రిలేషన్ లో ఉన్నారని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నాం అంటూ ప్రకటించారు.ఇలా వీరి పెళ్లి విషయం ద్వారా పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు.

ఇకపోతే చెప్పిన విధంగానే వీరిద్దరు పెళ్లి వీడియోని కూడా షేర్ చేయడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.

అయితే అది నిజ జీవితంలో చేసుకున్నటువంటి పెళ్లి కాదని మళ్లీ పెళ్లి(Malli Pelli) అనే సినిమాలో భాగంగా వీరిద్దరూ ఇలా నటించబోతున్నారని స్వయంగా నరేష్ తెలియజేశారు.ఇలా వీరిద్దరూ వీరి సినీ కెరియర్లో ఎంతో బిజీగా ఉంటూనే మరోవైపు పలు కార్యక్రమాలకు జంటగా హాజరవుతూ పెద్ద ఎత్తున అందరికీ సందడి చేస్తున్నారు.ఈ క్రమంలోనే తాజాగా ఈ జంట పశ్చిమగోదావరి జిల్లాలో సందడి చేశారు.

Advertisement

పశ్చిమగోదావరిలోని ఏలూరుపాడులో జరిగినటువంటి ఒక ప్రైవేట్ కార్యక్రమానికి వీరిద్దరు జంటగా హాజరయ్యారు.

ఇలా ఈ కార్యక్రమం అనంతరం వీరిద్దరూ జంటగా కూడలిలో ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు విగ్రహానికి, అలాగే అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం పక్కనే ఉన్నటువంటి అమ్మవారి ఆలయాన్ని సందర్శించి అక్కడ ప్రత్యేక పూజలు చేయించి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక వీరిద్దరూ కలిసి జంటగా నటించిన చిత్రం మళ్ళీ పెళ్లి ఈ సినిమా వేసవిలో విడుదల కాబోతుందని నరేష్ వెల్లడించిన విషయం మనకు తెలిసిందే.ఈ సినిమాలో మరోసారి వీరిద్దరూ జంటగా నటించబోతున్నట్లు తెలుస్తోంది.

రూ.10 లక్షల విరాళం ప్రకటించినా రష్మికపై ట్రోల్స్.. అలా చేయడమే తప్పైందా?
Advertisement

తాజా వార్తలు