శ్రీకాళహస్తి నియోజకవర్గం, కుక్కలవారి కండ్రికలో వరి కయ్యల్లోకి దిగి రైతులతో మాట్లాడిన నారా లోకేష్.రైతుల ఆవేదన.
వడ్లు కొనడం లేదు.కొన్నా డబ్బులిస్తారని నమ్మకం లేదు.
రైతు భరోసా కేంద్రాల్లో నచ్చిన వారికి ఫోన్లు చేసి విత్తనాలు, ఎరువులు అందిస్తున్నారు.చంద్రబాబు ఉన్నప్పుడు తప్ప ఈ ప్రభుత్వం వచ్చాక వడ్లు అమ్మలేదు.
ఈ క్రాప్ నమోదు చేయడం లేదు.పరిహారం అందించడం లేదు.
వరి కోతకు కూలీలు రాకపోవడం వల్ల మిషన్లతో కోయిస్తున్నాం.
నారా లోకేష్ మాట్లాడుతూ.రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని పాదయాత్రలో జగన్ హామీ ఇచ్చారు.కానీ ఆ నిధులు కేటాయించలేదు.రైతులను ఆదుకోలేదు.గతంలో ఉన్నట్లుగా ఎరువుల ధరలు ఇప్పుడు లేవు, పెరిగిపోయాయి.రైతులకు పెట్టుబడి పెరిగింది.
గిట్టుబాటు ధర రావడం లేదు.టీడీపీ ప్రభుత్వంలో భూసార పరీక్షలు చేసి ఏ పంట వేసుకోవాలో రైతులకు సూచించాం.
కానీ ఇప్పుడు భూసార పరీక్షలు లేవు.టీడీపీ ప్రభుత్వం వస్తేనే మళ్లీ రైతులకు మంచి రోజులు.