ఇండస్ట్రీ కి రెండు కళ్ళు లాంటి ఫామిలీ లు మెగా – నందమూరి ఫామిలీ లు.రెండు ఫ్యామిలీ ల మధ్యన భీకరమైన పోటీ నడుస్తూ ఉంటుంది.
అలాంటిది మెగా – నందమూరి హీరోలు ఇద్దరూ కలిసి ఒక సినిమాలో నటిస్తే ఎలా ఉంటుంది? అది పెద్ద సంచలనమే కదా .అదే జరగబోతోంది త్వరలో అని సమాచారం.
వరుసపెట్టి మంచి సెలెక్షన్లతో మార్కులు కొట్టేస్తున్న సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం సుప్రీమ్ షూటింగ్ లో బిజీగా వున్నాడు.అయితే తన తదుపరి ప్రాజెక్ట్ ని డైరెక్ట్ చేసే అవకాశాన్ని సాయికి మొదటి హిట్ అందించిన కె.ఎస్ రవికుమార్ చౌదరి కోరుతున్నట్టు సమాచారం.
ఈ సినిమాలో ఇద్దరు హీరోలకు స్థానముండడం మరోహీరోగా నందమూరి కళ్యాణ్ రామ్ కి కధ వినిపించినట్టు తెలుస్తుంది.
కళ్యాణ్ రాం ఈ ప్రాజెక్ట్ కి ఓకే చెబితే చాలు అని రవికుమార్ ఎదురు చూస్తున్నారు.సౌఖ్యం సినిమా ప్లాప్ కొట్టిన వేళ అతనికి సినిమా ఇస్తారా అనేది సందేహంగా మారింది.
/
.