హీరో వెంకటేష్ నన్ను మోసం చేశారు.. నందకుమార్ సంచలన వ్యాఖ్యలు!

సినిమా రంగంలో వివాదాలకు దూరంగా ఉండే హీరో ఎవరనే ప్రశ్నకు స్టార్ హీరో వెంకటేష్ పేరు సమాధానంగా వినిపిస్తుంది.

తన సినిమాలు విడుదలయ్యే సమయంలో మినహా మిగిలిన సమయాలలో వెంకటేష్ మీడియాకు దూరంగా ఉంటారనే సంగతి తెలిసిందే.

అయితే తాజాగా వెంకటేష్ భూ వివాదంలో చిక్కుకున్నారు.నందకుమార్ అనే వ్యక్తి వెంకటేష్ పై సంచలన ఆరోపణలు చేయగా ఆ ఆరోపణలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.సదరన్ స్పైసెస్ గ్రూప్ ఆఫ్ ఛైర్మన్ అయిన నందకుమార్ దగ్గుబాటి కుటుంబం తనను చీట్ చేసిందని కొన్నిరోజుల క్రితం కోర్టుకు హాజరు కావడం ఇండస్ట్రీ వర్గాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.1200 గజాల భూమి లీజు ఇంకా పూర్తి కాలేదని లీజు పూర్తి కాకముందే ఆ స్థలం ఖాళీ చేయాలని దగ్గుబాటి ఫ్యామిలీ కోరుతోందని నందకుమార్ కోర్టును ఆశ్రయించడం గమనార్హం.సిటీ సివిల్ కోర్టు దగ్గర మీడియాతో మాట్లాడిన నందకుమార్ షాకింగ్ విషయాలను వెల్లడించారు.

దగ్గుబాటి ఫ్యామిలీ నన్ను మోసం చేసిందని నాతో భూమి లీజుకు సంబంధించి అగ్రిమెంట్ చేసుకుని కనీస సమాచారం ఇవ్వకుండా ఆ భూమిని రానా పేరుపై మార్చారని నందకుమార్ అన్నారు.సురేష్ బాబుతో పాటు వెంకటేష్ కూడా నన్ను చీట్ చేశారని ఆయన చెప్పుకొచ్చారు.తాను లీజుకు తీసుకున్న భూమిని ప్రస్తుతం అమ్మకానికి పెట్టారని ఆయన కామెంట్లు చేశారు.

వెంకటేష్ కూడా అగ్రిమెంట్ ను పట్టించుకోకుండా స్థలం ఖాళీ చేయాలని బెదిరిస్తున్నారని నందకుమార్ చెప్పుకొచ్చారు.ఈ కారణం వల్లే నేను కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని ఆయన కామెంట్ చేశారు.

Advertisement

అయితే ఈ కోర్టు కేసు గురించి దగ్గుబాటి ఫ్యామిలీ స్పందించాల్సి ఉంది.దగ్గుబాటి కుటుంబం స్పందించని పక్షంలో ఫ్యాన్స్ లో కూడా దగ్గుబాటి హీరోలపై నెగిటివ్ ఒపీనియన్ ఏర్పడే అవకాశం అయితే ఉందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

వీడియో వైరల్‌ : కారుతో పెట్రోల్‌ పంప్‌ ఉద్యోగిపైకి దూసుకెళ్లిన పోలీసు..
Advertisement

తాజా వార్తలు