బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్7 ( Bigg Boss Show Season 7 )గత సీజన్లను మించి ఉంటుందని అందరూ భావించగా ఆ అంచనాలకు భిన్నంగా ఈ సీజన్ ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోవడం లేదు.ఈ షో విషయంలో వచ్చిన ట్రోల్స్ గతంలో బిగ్ బాస్ షోపై ఎప్పుడూ రాలేదు.
అయితే తాజాగా ఒక టాస్క్ లో భాగంగా ఉడత అనే పదం ఎన్నిసార్లు వచ్చిందనే ప్రశ్నకు రతిక ( Rathika )స్పందిస్తూ 1056సార్లు అని వెల్లడించారు.
అయితే హాట్ స్టార్ లో ఈ షోను చూసిన వాళ్లు మాత్రం రతిక చెప్పిన జవాబు రైట్ కాదని చెబుతున్నారు.బిగ్ బాస్ అభిమానులను గొర్రెల్ని చేస్తున్న నాగార్జున( Nagarjuna ) అంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి.బిగ్ బాస్ ఫ్యాన్స్ ఈ షో ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తోందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
పల్లవి ప్రశాంత్( Pallavi Prashant ) పై కూడా నెగిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి.
పల్లవి ప్రశాంత్ రైతుబిడ్డ అనే ట్యాగ్ ను ఉపయోగించుకుని బిగ్ బాస్ షో విన్నర్ గా నిలవాలని భావిస్తున్నారని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.కంటెస్టెంట్ల ఎంపికలో బిగ్ బాస్ నిర్వాహకులు పొరపాటు చేశారని కామెంట్లు వినిపిస్తున్నాయి.14 మంది కంటెస్టెంట్లతో బిగ్ బాస్ నిర్వాహకులు ఏం చేస్తారో చూడాల్సి ఉంది.13 మంది కంటెస్టెంట్లు మాత్రమే ప్రస్తుతం హౌస్ లో ఉండగా బిగ్ బాస్ ఆలోచన ఎవరికీ అర్థం కావడం లేదు.బిగ్ బాస్ షో కోసం ఈ షో నిర్వాహకులు భారీ మొత్తంలో ఖర్చు చేసిన నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.
బిగ్ బాస్ షో సీజన్7 కూడా ఫ్లాప్ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.