నాగబాబుకు మళ్లీ కోపం రావడానికి కారణం ఏంటీ?

మెగా బ్రదర్ నాగ బాబు కి మళ్లీ కోపం వచ్చింది.

ఆయన తాజాగా జరిగిన మెగా స్టార్ చిరంజీవి బర్త్‌ డే కార్యక్రమంలో తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.

తన అన్నయ్య చిరంజీవిని దారుణంగా అవమానించారు అంటూ ఆవేశంలో ఊగి పోయాడు.అసలు అన్నయ్య సరి రాని వారు కూడా ఆయన గురించి తప్పుడు వ్యాఖ్యలు చేస్తూ ఆయన స్థాయిని తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు.

చిరంజీవి అంటే ఒక గొప్ప మనసున్న వ్యక్తి అలాంటి వ్యక్తిని విమర్శించడానికి.అవమానించడానికి ఎలా మనసు వచ్చింది అంటూ నాగబాబు ఆవేశంతో తీవ్రంగా మండి పడ్డాడు.

తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఫ్యాన్‌ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.అయినా కూడా ఆయన్ను తమ కిందకు తెచ్చుకోవాలని ప్రయత్నాలు చేయడం వారి యొక్క అవివేకం అంటూ నాగ బాబు అన్నాడు.

Advertisement

గతంలో ఏపీ ప్రభుత్వం చిరంజీవిని అవమానించారు అంటూ నాగబాబు తాజాగా ఆ వ్యాఖ్యలు చేయడం జరిగింది.గతంలో నాగబాబుకు ఆ విషయమై స్పందించేందుకు సరైన వేదిక లభించలేదు.

అందుకే ఇప్పుడు స్పందించాడు అంటూ వార్తలు వస్తున్నాయి.అన్నయ్య చిరంజీవి పట్ల అనుచితంగా ప్రవర్తించిన వారితో పాటు తమ్ముడిని విమర్శించే వారికి కూడా ఘాటైన వార్నింగ్‌ ను నాగబాబు ఇచ్చారు.

చిరంజీవి పుట్టిన రోజు వేడుకలను ఫ్యాన్స్ భారీ ఎత్తున నిర్వహించారు.ఆ కార్యక్రమంలో మెగా ఫ్యామిలీకి చెందిన వారు పాల్గొన్నారు.నాగబాబు మెగా ఫ్యామిలీ తరపున ఆ కార్యక్రమంలో పాల్గొని కుటుంబం తరపున మెగా ఫ్యాన్స్ కు కృతజ్ఞతలు తెలియజేశాడు.

నాగబాబు ఆ కార్యక్రమం యొక్క నిర్వహణ దగ్గరుండి మరీ చూసుకున్నారట. నాగ బాబు వ్యాఖ్యల పట్ల ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తీవ్రమైన చర్చ జరుగుతోంది.మెగా బ్రదర్స్ ని అవమానిస్తే ఖచ్చితంగా తీవ్రంగా స్పందించాల్సిందే అంటూ మెగా ఫ్యాన్స్ కూడా చర్చించుకుంటున్నారు.

బాబోయ్, బిగ్‌బాస్ హౌస్‌ నిండా మెంటల్ కేసులే.. జుట్టు పీక్కుంటున్న ప్రేక్షకులు..
Advertisement

తాజా వార్తలు