చూస్తారు కాని ఆ పని చేయరు.. నాగబాబు కీలక వ్యాఖ్యలు..?

మెగా బ్రదర్ గా, నటుడిగా, నిర్మాతగా ఇండస్ట్రీలో గుర్తింపును సంపాదించుకున్నారు నాగబాబు.

పలు కామెడీ షోలకు జడ్జిగా వ్యవహరించిన నాగబాబు ఈ ఏడాది మళ్లీ వరుస ఆఫర్లతో బిజీ అవుతున్నారు.

యూట్యూబ్ ద్వారా నాగబాబు కొత్త టాలెంట్ ను వెలుగులోకి తెస్తున్నారు.సోషల్ మీడియాలో కూడా నాగబాబు యాక్టివ్ గా ఉంటూ నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు తన శైలిలో జవాబులు ఇస్తున్నారు.

ఖుషీఖుషీగా పేరుతో ప్రసారమవుతున్న ఒక స్టాండప్ కామెడీ షోకు నాగబాబు జడ్జిగా వ్యవహరిస్తున్నారు.ఈ షోకు వ్యూస్ బాగానే వస్తున్నా నాగబాబు ఆశించిన స్థాయిలో మాత్రం ఈ షో సక్సెస్ కాలేదు.

ఈ షో యూట్యూబ్ వీడియోలకు లక్షకు అటూఇటుగా వ్యూస్ వస్తున్నాయి.మరోవైపు ఈ షోలో శృతి మించిన కామెడీ ఎక్కువగా ఉందని కొంతమంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

తాజాగా ఒక నెటిజన్ ఖుషీఖుషీగా ప్రోగ్రామ్ అప్పుడే ఫైనల్ వరకు వచ్చేసిందా.? అంటూ అనిపిస్తోందని అభిప్రాయపడుతున్నారు.

నాగబాబు నెటిజన్ కామెంట్ కు బదులిస్తూ ఖుషీఖుషీగా ప్రోగ్రామ్ గురించి ఇప్పుడు ఇలానే కామెంట్లు చేస్తారని యూట్యూబ్ వీడియోలను చూసి షేర్ మాత్రం చేయరని అన్నారు.ఆ షోకు వ్యూస్ ఎక్కడున్నాయి అంటూ సెటైర్లు వేశారు.నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు నాగబాబు ఎంతో ఓపికగా సమాధానాలు ఇస్తారు.

అయితే నాగబాబు చెబుతున్న కొన్ని జవాబుల వల్ల వివాదాలు క్రియేట్ అవుతుండటం గమనార్హం.నాగబాబు సరదాగా చెబుతున్న కొన్ని సమాధానాలను నెటిజన్లు సీరియస్ గా తీసుకోవడం వల్ల వివాదాలు క్రియేట్ అవుతున్నాయి.మరోవైపు నాగబాబు విలన్ పాత్రలో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.15 సంవత్సరాల క్రితం తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్టైన ఛత్రపతి మూవీ బాలీవుడ్ లో రీమేక్ అవుతుండగా బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సినిమాలో హీరోగా నటిస్తుండటం గమనార్హం.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు