ప్రొడ్యూసర్ ప్లాన్‌కు నామం పెట్టిన చైతూ

అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో ‘లవ్ స్టోరి’ అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో అందాల భామ సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఇక ఈ సినిమా పూర్తి కాకముందే చైతూ తన నెక్ట్స్ చిత్రాలను కూడా ఓకే చేస్తూ లైన్‌లో పెట్టేందుకు రెడీ అయ్యాడు.అయితే తనకు ఎప్పటినుండో ఓ సినిమాను ప్రొడ్యూస్ చేయాలని ఉందని గతంలోనే చైతూ చెప్పుకొచ్చాడు.

కాగా ఈమధ్య ఓ కథను విన్న నాగ చైతన్య, ఆ సినిమాను ప్రొడ్యూస్ చేసేందుకు ముందుకు వచ్చాడు.‘సీతమ్మ అందాలు రామయ్య చిత్రాలు’ చిత్రంతో డైరెక్టర్‌గా మెప్పించిన శ్రీనివాస్ గవిరెడ్డి, మరోసారి రాజ్ తరుణ్ హీరోగా ఓ సినిమాను ప్లాన్ చేశాడు.

ఈ సినిమాను తొలుత చైతూ నిర్మించేందుకు ఆసక్తి చూపాడు.అయితే రాజ్ తరుణ్ ఇటీవల నటించిన ‘ఒరేయ్ బుజ్జిగా’ చిత్రం ఓటీటీలో రిలీజ్ అయ్యి ఫ్లాప్‌గా నిలిచింది.

Advertisement

దీంతో చైతూ వేనకడుగు వేసినట్లు తెలుస్తోంది.ఇటీవల కాలంలో రాజ్ తరుణ్ నటించిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతుండటంతో అతడిపై ఇన్వెస్ట్ చేయడం వృథా అవుతుందని చైతూ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

దీంతో వెంటనే ఆయన నిర్మాతగా ఆ సినిమా చేయడం లేదని తేల్చి చెప్పేశాడట.దీంతో సదరు చిత్రం అటకెక్కిందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

ఏదేమైనా ఇలా ప్రొడ్యూసర్‌గా మారి ఇండస్ట్రీలో రాణించాలని చాలా మంది ప్రయత్నించినా, వారిలో కొంతమంది మాత్రమే సక్సెస్ అయ్యారు.మొత్తానికి రాజ్ తరుణ్ దెబ్బకు చైతూకు జ్ఞానోదయం అయ్యి నిర్మాతగా మారాలనే ఆలోచనను ప్రస్తుతానికి పక్కనబెట్టడంతో అక్కినేని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక లవ్‌స్టోరి చిత్రాన్ని వీలైనంత త్వరగా రిలీజ్ చేసి అదిరిపోయే సక్సెస్ అందుకోవాలని చైతూ అండ్ టీమ్ రెడీ అవుతోంది.

బీజేపీ కార్మిక, కర్షక వ్యతిరేక పార్టీ.. మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు
Advertisement

తాజా వార్తలు