మహేష్ బాబుకు ఝలక్ ఇచ్చిన చైతూ, సమంత

సూపర్ స్టార్ మహేష్ బాబు ఏప్రిల్ మొదటి వారంలో మహర్షి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా ప్రకటించిన విషయం తెలిసిందే.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న మహర్షి సినిమా మహేష్ బాబుకు చాలా ప్రత్యేకం.

ఎందుకంటే ఇది మహేష్ కెరీర్ లో 25వ సినిమా.అందుకే ఈ సినిమా పై మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా చాలా అంచనాలు పెంచుకున్నారు.

అయితే ఈ సినిమా విడుదల విషయంలో మహేష్ కు ఝలక్ ఎదురైంది.

మహేష్ బాబు మహర్షి తో రావాలని భావించిన ఏప్రిల్ 5వ తేదీన మజిలీ సినిమా విడుదల కాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.ఏప్రిల్ లో సినిమా విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చిన నేపథ్యంలో మహేష్ మహర్షి పరిస్థితి ఏంటి అనేది ప్రస్తుతం అందరిలో మెదులుతున్న ఆసక్తికర విషయం.అసలు మహర్షి ఏప్రిల్ లో ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Advertisement

మహర్షి సినిమా విడుదల ఉండగా మజిలీ సినిమాను విడుదల చేసేందుకు ఎవరు కూడా సాహసించారు.మహర్షి సినిమా విడుదల విషయంలో క్లారిటీ లేని కారణంగానే మజిలీ సినిమాను విడుదల చేసేందుకు తీసుకు వచ్చారు.పెళ్లి తర్వాత నాగ చైతన్య, సమంతలు కలిసి నటిస్తున్న కారణంగా మజిలీ పై అంచనాలు భారీగా ఉన్నాయి.

ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు