మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కీలక నిర్ణయం..!!

ఏపీలో అధికార పార్టీగా ఉన్న వైసీపీలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

వచ్చే ఎన్నికల్లో టికెట్ లేదని వసంత కృష్ణప్రసాద్ కు పార్టీ అధిష్టానం సమాచారం ఇచ్చిందని తెలుస్తోంది.దీంతో ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

ఈ నేపథ్యంలోనే తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి పిలిచినా వసంత కృష్ణ ప్రసాద్ దూరంగా ఉన్నారని తెలుస్తోంది.కాగా మరికాసేపటిలో నియోజకవర్గాలకు ఇంఛార్జీలను మారుస్తూ రెండో జాబితాను పార్టీ అధిష్టానం ప్రకటించనుంది.

అధ్యక్ష ఎన్నికల వేళ డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ రిలీఫ్.. ఆ కేసు కొట్టివేత
Advertisement

తాజా వార్తలు