కమలహాసన్ సూపర్ స్టార్ మహేష్ కాంబినేషన్.. టాలీవుడ్ లో జోరుగా చర్చ

విశ్వనటుడు కమల్ హాసన్ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విక్రమ్ అనే మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

మరోవైపు శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 మూవీ కూడా పూర్తి చేయాల్సి ఉంది.ఈ మూవీ మెజారిటీ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది.

ప్రస్తుతం దర్శక నిర్మాతలకు మధ్య ఈ మూవీ విషయంలో గొడవ జరుగుతున్న సంగతి తెలిసిందే.ఈ గొడవ సమసిపోతే సినిమాని స్టార్ట్ చేయడానికి శంకర్ కూడా సిద్ధం అవుతున్నాడు.

ఇదిలా ఉంటే సౌత్లో మరో క్రేజీ కాంబినేషన్ సెట్ కాబోతుందనే టాక్ ఇప్పుడు గట్టిగా వినిపిస్తుంది.కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ ఈ కాంబినేషన్ లో మూవీని సెట్ చేసే పనిలో ఉన్నట్లు సమాచారం.

Advertisement

సూపర్ స్టార్ మహేష్ బాబు, కమలహాసన్ కాంబినేషన్ లో భారీ మల్టీ స్టారర్ చిత్రంగా దీన్ని తెరకెక్కించాలని మురుగదాస్ ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

తెలుగులో దర్శకుడుగా మురుగదాస్ కి ఫ్లాప్ రికార్డు ఉంది.చివరిగా అతను మహేష్ బాబుకి స్పైడర్ సినిమాతో ఘోరమైన ఫ్లాప్ ఇచ్చాడు.అయినా కూడా మురుగదాస్ తో మరోసారి పని చేయడానికి మహేష్ ఆసక్తిగానే ఉన్నారు.

ఈ నేపధ్యంలో ఈ దర్శకుడు కచ్చితంగా ఈసారి మహేష్ కి బ్లాక్ బస్టర్ ఇవ్వాలని ఓ అదిరిపోయే స్టోరీ అతనికి రీసెంట్ గా చెప్పడం జరిగిందని టాక్ వినిపిస్తుంది.ఈ కథలో మహేష్ బాబు సిబిఐ ఆఫీసర్ గా, కమల్ హాసన్ ఓ యువతి తండ్రి పాత్రలో కనిపిస్తారని ఇన్ సైడ్ టాక్.

ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కించేందుకు ముందుకు వస్తున్నట్లు తెలుస్తుంది.మరి ఈ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది తెలియాల్సి ఉంది.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు