మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి నామినేషన్ దాఖలు చేయనున్నారు.ఈ నెల 11వ తేదీన ఆమె రెండు సెట్లు అధికారులకు అందజేస్తారు.
ఆ తర్వాత 14న భారీ జనసమీకరణతో మరోసారి నామినేషన్ వేయనున్నారు.మరోవైపు గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది.
దీనిలో భాగంగా ఈనెల 9 నుంచి 14 వరకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా ఇంఛార్జ్ లు మునుగోడులోనే మకాం వేయనున్నారు.నమ్మకానికి, అమ్మకానికి మధ్య యుద్ధమంటూ కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం చేపట్టనుంది.
అంతేకాకుండా మహిళా అభ్యర్థికి అవకాశం ఇచ్చామనే విషయాన్ని కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని తెలంగాణ కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.