డయాబెటిస్.దీనినే కొందరు మధుమేహం అని, మరికొందరు చక్కెర వ్యాధి అని పిలుస్తుంటారు.దీర్ఘకాలిక వ్యాధుల్లో ఇదీ ఒకటి.అందుకే డయాబెటిస్ ఒక్కసారి వచ్చిందంటే వదిలించుకోవడం అసాధ్యమని అంటుంటారు.అలాగే పూర్వం వయసు పైబడిన వారిలో మాత్రమే కనిపించే ఈ వ్యాధి.నేటి రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా అందరిపైనా దాడి చేస్తూ ముప్పు తిప్పలు పెట్టేస్తోంది.
ఇక డయాబెటిస్కి గురైన వారు ఆరోగ్యం పట్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి.ముఖ్యంగా స్వీట్స్కు ఆమడ దూరంలో ఉండాలి.
కానీ, డయాబెటిస్ రోగుల్లో చాలా మంది షుగర్ క్రేవింగ్స్ను ఆపుకోలేక స్వీట్స్ను లాగించేస్తారు.ఫలితంగా బ్లడ్ షుగర్ లవెల్స్ అమాంతం పెరిగి పోతాయి.
అయితే షుగర్ క్రేవింగ్స్ను తగ్గించడానికి ఉత్తమ మార్గాలు కొన్ని ఉన్నాయి.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మధుమేహం వ్యాధి గ్రస్తులు షుగర్ క్రేవింగ్స్ వచ్చినప్పుడల్లా ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిని సేవించాలి.తద్వారా స్వీట్స్ తినాలన్న కోరిక క్రమంగా డౌన్ అయిపోతుంది.
అలాగే ఒత్తిడిలో ఉన్నప్పుడు స్వీట్స్పై మనసు లాగేస్తుంటుంది.అందుకే డయాబెటిస్ రోగులు ఒత్తిడి దరి చేరకుండా రోజూ యోగా, ధ్యానం వంటివి చేయాలి.కంటి నిండా నిద్ర లేకపోయినా కూడా షుగర్ క్రేవింగ్స్ విపరీతంగా పెరిగి పోతుంటారు.కాబట్టి, డయాబెటిస్ ఉన్న వారు తప్పకుండా రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్రించాలి.
పుచ్చ గింజలు, గుమ్మడి కాయ గింజలు, బాదం పప్పు, బ్లాక్ బన్స్, శెనగలు వంటివి రోజూ స్నాక్స్గా తీసుకోవాలి.తద్వారా శరీరానికి బోలెడన్ని పోషకాలు అందుతాయి.మరియు ఎక్కువ సమయం పాటు కడుపు నిండిన భావన కలుగుతుంది.దాంతో షుగర్ క్రేవింగ్స్ దరి దాపుల్లోకి రాకుండా ఉండటమే కాదు.ఇతర ఏ చిరు తిండ్లపై సైతం మనసు మల్లకుండా కూడా ఉంటుంది.