మునుగోడు ఉపఎన్నిక పంచాయితీ ఢిల్లీకి చేరింది.ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నేతల బృందం అక్కడకు చేరుకుంది.వీరు మధ్యాహ్నం 12.30 గంటలకు ఎన్నికల సంఘం ప్రధానాధికారిని కలవనున్నారని సమాచారం.అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ అధికార దుర్వినియోగం చేస్తోందని బీజేపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేయనున్నారు.ఉపఎన్నిక నేపథ్యంలో బీజేపీ, టీఆర్ఎస్ ల మధ్య గత కొన్ని రోజులుగా మాటల యుద్ధం కొనసాగుతోంది.
దీనిలో భాగంగా పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు.







