సీతా మహాలక్ష్మి టాలీవుడ్ లో మరో లక్కీ ఛాన్స్ అందుకున్నట్టు తెలుస్తుంది.ఇప్పటికే నాని 30వ సినిమాలో నటిస్తున్న మృణాల్ లేటెస్ట్ గా సైంధవ్ సినిమాలో కూడా ఛాన్స్ పట్టేసిందట.
ఇదేకాదు కింగ్ నాగార్జున కన్ను కూడా మృణాల్ మీద పడిందని టాక్.ప్రస్తుతం ప్రసన్న కుమార్ తో చేస్తున్న సినిమా నుంచి కూడా మృణాల్ కి ఆఫర్ వచ్చిందట.
సీతారామం హిట్ తో ఒకటి రెండు కాదు ముచ్చటగా మూడు అవకాశాలు దక్కించుకుంది అమ్మడు. బాలీవుడ్ లో ఐదారేళ్లుగా చేస్తున్నా అంత గొప్ప క్రేజ్ రాలేదు.
తెలుగులో ఒక్క సినిమాతోనే అమ్మడి టాలెంట్ గుర్తించారు.అందుకే వరుస అవకాశాలు ఇస్తున్నారు.ఇక్కడ వరుస ఛాన్స్ లు వస్తుండటం వల్ల మృణాల్ హైదరాబాద్ షిఫ్ట్ అవ్వాలని అనుకుంటుందట.3 సినిమాలను మ్యానేజ్ చేయాలి అంటే రెగ్యులర్ గా వెళ్లి రావడం కన్నా ఇక్కడకు షిఫ్ట్ అయితే కొన్నాళ్లు తెలుగు సినిమాలను ఏలొచ్చని మృణాల్ డిసైడ్ అయినట్టు ఉంది.ఈ మూడు సినిమాలతో అమ్మడి రేంజ్ కచ్చితంగా మారుతుందని చెప్పొచ్చు.అందుకే మృణాల్ ఇక్కడ కాన్సెంట్రేట్ చేస్తుంది.వీటితో పాటుగా బాలీవుడ్ ఛాన్స్ లను కూడా ఓకే చేసేలా ఉంది.