బాలకృష్ణ చెప్పిన సమయానికే తారకరత్న అంత్యక్రియలు.. విజయసాయిరెడ్డి కామెంట్స్ వైరల్?

తారకరత్న.ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీలో మార్మోగుతున్న పేరు.

నందమూరి హీరో అయిన తారకరత్న తాజాగా శనివారం రోజున శ్వాస విడిచిన విషయం తెలిసిందే.తారకరత్న మరణంతో ఒక్కసారిగా నందమూరి ఫ్యామిలీలో అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీలో విషాదఛాయలు అలముకున్నాయి.

ఆయన మరణ వార్తను అభిమానులు కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు.తారకరత్న ఇకలేరు అన్న వార్తను నమ్మలేకపోతున్నారు.

ఇప్పటికే తారకరత్న మృతి పట్ల సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.

Advertisement

సినిమా ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు ఇప్పటికే తారకరత్న ఇంటికి చేరుకొని ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించారు.ఇకపోతే తారకరత్న మరణించడంతో ఆయన భార్య అలేఖ్య రెడ్డి,పిల్లల బాధ్యత తనదే అని తారకరత్న బాబాయి బాలకృష్ణ మాట ఇచ్చిన విషయం తెలిసిందే.ఈ విషయాన్ని విజయసాయిరెడ్డి తెలిపారు.

బాలకృష్ణ నిర్ణయించిన సమయానికి తారకరత్న అంత్యక్రియలు జరగబోతున్నట్లు విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు.తారకరత్న మరణం తనను ఎంతగానో బాధించిందని, సినీ రంగంలో ప్రతి ఒక్కరితో సత్సంబంధాలు కొనసాగించారు అంటూ తారకరత్నని గుర్తుచేసుకున్నారు విజయసాయిరెడ్డి.

సోమావారం అనగా నేడు మధ్యాహ్నం 3 గంటలకు తారకరత్న అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు.భర్త మృతితో అలేఖ్య రెడ్డి తీవ్ర మానసిక ఒత్తిడికి గురైందని తారకరత్న మరణాన్ని అలేఖ్య ఇంకా జీర్ణించుకోలేకపోతుంది అంటూ బాధను వ్యక్తం చేశారు.కాగా ఇప్పటికే తారకరత్న పార్థివ దేహం ఫిలిం ఛాంబర్ కు చేరుకున్నట్టు తెలుస్తోంది.

తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి విజయసాయి రెడ్డికి స్వయానా మరదలి కూతురు అన్న విషయం తెలిసిందే.విజయ జయసాయి రెడ్డి భార్య తారకరత్న భార్య తల్లి ఇద్దరు కూడా అక్కాచెల్లెళ్లు.

వైరల్ : కొడుకు కోసం ఆ తండ్రి బిర్యానీతో పడిన కష్టం.. ఎమోషనల్ స్టోరీ..
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయనే ? 

తారకరత్నకు విజయసాయిరెడ్డి వరుసకు మామయ్య అవుతారు.

Advertisement

తాజా వార్తలు