జనసేనలో ఎంపీ బాలశౌరి చేరికకు ముహుర్తం ఖరారు..!!

జనసేనలో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ( MP Vallabhaneni Balashauri )చేరికకు ముహుర్తం ఖరారు అయింది.ఈ మేరకు వచ్చే నెల 2వ తేదీన ఆయన జనసేన పార్టీ కండువా కప్పుకోనున్నారు.

అదే రోజు మచిలీపట్నంలో జనసేన ( Janasena )భారీ బహిరంగ సభను నిర్వహించాలని కీలక నిర్ణయం తీసుకుందని పార్టీ వర్గాలు చెప్పినట్లు తెలుస్తోంది.కాగా ఈ బహిరంగ సభకు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) హాజరుకానున్నారు.అయితే పవన్ కల్యాణ్ ఆశయాలు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న ఆకాంక్ష నచ్చి జనసేనలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు ఎంపీ బాలశౌరి తెలిపిన సంగతి తెలిసిందే.

వైసీపీకి రాజీనామా చేసిన మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ఫిబ్రవరిలో జనసేనలో చేరనున్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికలు : రెండు పార్టీల్లోనూ గెలుపు ధీమా 
Advertisement

తాజా వార్తలు