పండిట్ మోతీలాల్ నెహ్రూ జీవితం సాగిందిలా... ఎంతో హోదానో అంత సాదా కూడా..

దేశ స్వాతంత్య్ర ఉద్య‌మంలో పండిట్ మోతీలాల్ నెహ్రూ( Motilal nehru ) విశేష కృషి చేశారు.జాతిపిత మహాత్మాగాంధీ ప్రభావంతో న్యాయవాద వృత్తిని వదిలి స్వాతంత్య్ర పోరాటంలో దూకారు.

 Motilal Nehru Famous Lawyer , Motilal Nehru , Lawyer , National Congress , Lahor-TeluguStop.com

ఈ గొప్ప స్వాతంత్ర‌ సమరయోధుడి జీవితానికి సంబంధించిన ప్రత్యేక విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.మోతీలాల్ నెహ్రూ 1861 మే 6న ప్రయాగ్‌రాజ్ (అప్పటి అలహాబాద్)లో జన్మించారు.

అతని తండ్రి పేరు గంగాధర్ నెహ్రూ మరియు తల్లి పేరు ఇంద్రాణి.ఢిల్లీలో కొత్వాల్‌గా ఉన్న అతని తండ్రి మోతీలాల్ పుట్టడానికి మూడు నెలల ముందు మరణించాడు.

మోతీలాల్ రాజస్థాన్‌లోని ఖేత్రిలో దివాన్‌గా ఉన్న అతని అన్న నంద్‌లాల్ నెహ్రూ వద్ద పెరిగారు.

మోతీలాల్ బాల్యం ఖేత్రిలో గడిచింది.తర్వాత ఈ కుటుంబం మొదట ఆగ్రాకు, తర్వాత అలహాబాద్‌కు వెళ్లింది.మోతీలాల్ చాలా తొందరగా చదివేవాడు.

నంద్‌లాల్ డబ్బు పోగుచేసి మోతీలాల్‌ను కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి లా చదవడానికి పంపాడు.ఇక్కడి నుంచి మోతీలాల్ ‘బార్ ఎట్ లా’ చేశారు.

దీని తర్వాత మొదట కాన్పూర్‌లో ప్రాక్టీస్ చేశారు.తర్వాత 1988లో అలహాబాద్ హైకోర్టులో ప్రాక్టీస్ చేయడానికి అలహాబాద్‌కు వెళ్లారు.

మోతీలాల్ సివిల్ కేసులలో మంచిపేరు, డబ్బు సంపాదించారు.

ఆ రోజుల్లో అలహాబాద్‌( Allahabad )లో సర్ జాన్ ఏజీ ప్రధాన న్యాయమూర్తిగా ఉండేవారు.అతను మోతీలాల్‌ను చాలా సమర్థులైన న్యాయవాదుల మధ్య ఉంచేవాడు.అతను వాదించడానికి వచ్చినప్పుడు, అతని మాటలు వినడానికి చాలామంది చేరేవారు.

కొంతకాలం తర్వాత, మోతీలాల్ ఒక కేసు కోసం భారీ మొత్తాన్ని తీసుకోవ‌డం ప్రారంభించారు.అది వేలల్లో ఉండేది.

పెద్ద భూస్వాములు, తాలూకాదార్లు, రాజులు, చక్రవర్తుల భూమికి సంబంధించిన కేసులు అతని వద్దకు వ‌చ్చేవి.దేశంలోనే అత్యంత ఖరీదైన లాయర్లలో ఒకరిగా ఆయ‌న నిలిచారు.

అతని జీవనశైలి కూడా బ్రిటీష్ వారిలాగే ఆధునికమైనది.కోటు-ప్యాంట్, వాచ్, అన్ని రకాల విలాసాలు చ‌విచూశారు.1889 తరువాత అతను కేసుల కోసం నిరంతరం ఇంగ్లండ్‌కు వెళ్లేవారు.అక్కడ ఖరీదైన హోటళ్లలో బస చేసేవారు.1900వ సంవత్సరంలో అలహాబాద్ సివిల్ లైన్‌లో ఆనంద్ భవన్ అనే పేరుతో విలాసవంతమైన బంగ్లాను కొనుగోలు చేశారు.ఇదే నేడు నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన మ్యూజియం.

న్యాయవాదిగానే కాకుండా మోతీలాల్ యొక్క కీర్తి కూడా అతనిని రాజకీయాల్లోకి లాగింది నెహ్రూ నివేదిక నిజానికి మోతీలాల్ నెహ్రూ రాశారు.నెహ్రూ నివేదికను కాంగ్రెస్ ఆమోదించింది.కానీ అతని కుమారుడు జవహర్‌లాల్ నెహ్రూతో సహా చాలా మంది జాతీయవాద నాయకులు దానిని అంగీకరించలేదు.భారతీయులు సంపూర్ణ స్వాతంత్రం కోరాలని ఆయ‌న అన్నారు.

మరుసటి సంవత్సరం, లాహోర్ సెషన్‌లో పూర్ణస్వరాజ్ తీర్మానాన్ని కాంగ్రెస్ ( Congress )ఆమోదించింది.దీని తర్వాత మోతీలాల్ నెహ్రూ గాంధీజీ ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు కూడా వెళ్లారు.

అయితే అనారోగ్య కారణాలతో ఆయన విడుదలయ్యారు.ఆయన 1931 జనవరి 6న మరణించారు.

Pandit Motilal Nehru Personal Life Motilal Nehru Life Story

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube