భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( Narendra Modi ) కీలక ట్వీట్ చేశారు.రైతు సంక్షేమానికి సంబంధించిన ప్రతి తీర్మానాన్ని నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.
చెరకు కొనుగోలు ధరలో చరిత్రాత్మక పెంపుదలకు ఆమోదం లభించిందని మోదీ పేర్కొన్నారు.చెరకు ఉత్పత్తి చేసే కోట్లాది మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.
మరోవైపు కేంద్ర ప్రభుత్వ తీరుపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రైతులపై కాల్పులు జరపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్న రైతు సంఘాలు ఢిల్లీ ( Delhi )చలోను రెండు రోజులపాటు నిలిపివేశారు.
ఈ క్రమంలోనే కేంద్రంలో చర్చలకు సిద్ధంగా లేమంటున్న రైతు సంఘాల నేతలు ఈ వ్యవహారంపై మోదీ నేరుగా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.