ఖతార్ వేదికగా ఫిఫా వరల్డ్ కప్ టోర్నీలో ఫైనల్ మ్యాచ్ లో ఫ్రాన్స్ పై అర్జెంటీనా గెలవడం సంచలనం సృష్టించింది.నరాలు తెగే ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్ లో అర్జెంటీనా టీం కెప్టెన్ లియోనెల్ మెస్సీ ఆడిన ఆట తీరు అందరిని ఆకట్టుకుంది.
అర్జెంటీనా టీం గెలవడంలో ప్రముఖ పాత్ర పోషించాడు.మ్యాచ్ తొలి అర్ధ భాగంలో తర్వాత … పెనాల్టీ షూట్ అవుట్ లో రెండు గోల్స్ వేసి ప్రత్యర్థి జట్టుని మెస్సీ చిత్తు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ప్రధాని మోడీ.అర్జెంటీనా టీంకి శుభాకాంక్షలు తెలియజేశారు.“ఫిఫా ప్రపంచకప్ అత్యంత ఉత్కంఠ భరితమైన ఫుట్ బాల్ మ్యాచ్ లలో ఒకటిగా నిలిచిపోతుంది.ఛాంపియన్స్ అయినందుకు అర్జెంటీనాకు అభినందనలు.
టోర్నీలో అందరు అద్భుతంగా గేమ్ ఆడారు.అర్జెంటీనా మరియు లియోనాల్ మెస్సి యొక్క మిలియన్ ల మంది భారతీయ అభిమానులు.
ఈ అద్భుతమైన విజయంలో ఎంతో సంతోషిస్తున్నారు”.అంటూ ప్రధాని మోడీ ట్విటర్ లో శుభాకాంక్షలు తెలియజేశారు.