ఇటీవల హ్యాకర్లు రెచ్చిపోతున్నారు.చాలామంది రాజకీయ నాయకుల అకౌంటులతో పాటు పార్టీల అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ లను హ్యక్ చేస్తున్నారు.
ఈ అకౌంట్లను హ్యాక్ చేసి.డీపీలు మార్చడంతో పాటు సంబంధం లేని పోస్టులు పెడుతున్నారు.
రాజకీయ నేతలు ప్రభుత్వ అధికారులకు చెందిన ట్విట్టర్ అకౌంట్లు వరుసగా హ్యాకింగ్ కి గురవుతున్నాయి.ఈరోజు ఉదయమే గవర్నర్ తమిళిసై( Tamilisai ) హ్యాక్ కావడం జరిగింది.
దీంతో వెంటనే ఆమె సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడం జరిగింది.కాగా సాయంత్రం MLC కవిత( MLC Kavitha ) ట్విట్టర్ అకౌంట్ నీ హ్యాకింగ్ కి గురికావడం జరిగింది.
దీంతో ఆమె కూడా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందట.గతంలో ఇదేవిధంగా ఆర్టీసీ ఎండి సజ్జనార్, మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ అకౌంట్లు కూడా హ్యాక్ కావటం జరిగింది.
మొన్న తెలంగాణ వైద్యరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఫేస్ బుక్ పేజ్ కూడా హ్యాక్ చేయడం జరిగింది.గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వైసీపీ పార్టీ ఇంకా తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ ఎకౌంట్లు హ్యాకర్ల బారిన పడటం జరిగాయి.
చాలామంది ప్రముఖులు మరియు రాజకీయ నాయకుల ట్విట్టర్ ఎకౌంటులతో పాటు పార్టీల అకౌంట్లు ఇటీవల ఎక్కువ హ్యాకర్ల బారిన పడుతున్నాయి.