కేంద్రం మెడలు వంచైన వడ్లు కొనేటట్లు చేస్తాం అని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు.భూపాలపల్లి జిల్లా కేంద్రం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.కేంద్రం తెలంగాణ పై వివక్ష చూపుతుందనీ అన్నారు.
గిరిజనుల రిజర్వేషన్ విషయంలో నిన్న పార్లమెంట్ లో గిరిజన శాక మంత్రి అసత్యప్రచారాలు చేస్తున్నారని.
ప్రధాని నరేంద్ర మోడీకి చిత్తశుద్ది ఉంటే అబద్ధపు ప్రచారాలు చేసిన కేంద్ర మంత్రినీ వెంటనే బర్తరఫ్ చేయాలనీ డిమాండ్ చేశారు.
సీఎం కేసిఆర్ కు రైతులలో వస్తున్న ఆదరణ చూడలేక వడ్లు కొనుగోలు విషయం లో కేంద్రం పేచీ పడుతుందన్నారు.కేంద్రం మెడలు వంచైన వడ్లు కోనిపిస్తామని అన్నారు.
బీజేపీ నాయకులు వడ్ల కొనుగోలు విషయం లో ఢిల్లీ లో ఒక మాట గల్లి లో ఒక మాట మాట్లాడుతున్నారనీ అన్నారు.పార్లమెంట్ లో ప్రతి పక్ష పార్టీ అని చెప్పుకొని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చిల్లర మాటలు మాట్లాడుతున్నారు.
ఆయనకు రైతుల సమస్యలు కనపడడం లేదా అని ప్రశ్నించారు.రేవంత్ రెడ్డికి నిజంగా చిత్త శుద్ది ఉంటే రైతుల పక్షాన trs ఎంపీ లతో కలిసి పార్లమెంట్ లో కొట్లడాలని పిలుపునిచ్చారు.
రేపు జిల్లా కేంద్రం లో కార్యకర్తల తో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తాం అన్నారు.ఉగాది లోపు రైతుల పక్షాన గ్రామ పంచయతీల్లో, మండల ,జిల్లా పరిషత్ లలో తీర్మానాలు చేసి కేంద్ర ప్రభుత్వనికి పంపిస్తాంఅని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు.