తెలుగులో ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ మరియు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన “గద్దల కొండ గణేష్” చిత్రంలో రెండో హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను అలరించిన యంగ్ బ్యూటీ “మృణాళిని రవి” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు వచ్చి రావడంతోనే వరుణ్ తేజ్ స్టార్ హీరో చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకున్నప్పటికీ హీరోయిన్ గా అవకాశాలు మాత్రం దక్కించుకోలేక పోతోంది.
దీంతో అందం, అభినయం, నటన ప్రతిభ వంటివి మెండుగా ఉన్నప్పటికీ మృణాళిని రవి కి తన ప్రతిభను నిరూపించుకునేందుకు సరైన అవకాశం లేకపోవడంతో గుర్తింపు నోచుకోలేక పోయింది.దాంతో ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీ పై దృష్టి సారించేందుకు సన్నద్ధం అవుతోంది.
ఈ క్రమంలో సినిమా ఇండస్ట్రీ గురించి అన్నీ తెలిసినటువంటి ఓ మేనేజర్ ని కూడా నియమించుకుంది.
అయితే ఇటీవల “ఇంజనీర్స్ డే” కావడంతో మృణాళిని రవి కాలేజి రోజుల్లో తను ఇంజనీరింగ్ చదివే సమయంలో తీసినటువంటి ఈ ఫోటోలను తన అధికారిక షేర్ చేసింది.
అయితే ఇందులో ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత పట్టాని అందుకుంటుండగా తీసిన ఫోటోలు అలాగే ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ అయిన ఐబీఎం సంస్థలో ఇంజనీరుగా పని చేసిన సమయంలో తీసిన ఫోటోలు వంటివి షేర్ చేసింది.దీంతో మరియు అభిమానులు మృణాళిని రవి కి ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు.
అయితే తెలుగులో గద్దల కొండ గణేష్ చిత్రం లో నటించిన తర్వాత ఈ అమ్మడు మళ్ళీ సినిమా అవకాశాలు దక్కించుకోలేక పోయింది.కానీ మలయాళం భాషలో మాత్రం వరస అవకాశాలు దక్కించుకుంటూ బాగానే రాణిస్తోంది.
కాగా ప్రస్తుతం ప్రముఖ హీరో చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న కోబ్రా చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది.అలాగే “ఎనిమీ” అనే మరో చిత్రంలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.