ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆహ్వానం మేరకు మెగాస్టార్ చిరంజీవి ఇటీవల కలవడం తెలిసిందే.ప్రత్యేకంగా ఈ భేటీలో.
జగన్ అదే రీతిలో చిరంజీవి కలిసి భోజనం చేయడం జరిగింది.ఇద్దరి మధ్య ఇండస్ట్రీ గురించి ఇంకా అనేక విషయాల గురించి చర్చకు వచ్చినట్లు వార్తలు వచ్చాయి.
అయితే భేటీ అనంతరం చిరంజీవి మాట్లాడుతూ వన్ టూ వన్ జరిగిన ఈ సమావేశం చాలా ఆహ్లాదకరంగా జరిగిందని… చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు.
ఇండస్ట్రీకి మంచి చేసే విధంగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే తాజాగా ఈ బేటీ పై మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.చిరంజీవితో జరిగినవి సంప్రదింపులకు కుశలప్రశ్నలు మాత్రమే.అని తెలిపారు.సీఎం భోజనానికి పిలిచారు… చిరంజీవి వెళ్ళారు అని తెలిపారు.
భోజనం చేస్తూ వంద మాట్లాడుకుంటారు.ఈ భేటీలో తాను లేను అని చెప్పిన పేర్ని నాని… సినిమా టికెట్ల వ్యవహారం సచివాలయంలో జరుగుతుంది కానీ.
ఇంట్లో ఎందుకు జరుగుతాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.భోజనం చేసే సమయంలో అనధికారికంగా చాలా మాట్లాడుకుంటారు.
వాటి గురించి.వ్యాఖ్యలు చేయడం అనవసరం అంటూ మంత్రి పేర్ని నాని తనదైన శైలిలో చెప్పుకొచ్చారు.