యూనివర్సిటీ పేరు మార్పుపై నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై మంత్రి జోగి రమేష్ తీవ్రస్థాయిలో స్పందించారు.బాలకృష్ణ మూడు రోజుల తర్వాత సృహాలోకి వచ్చి ఎన్టీఆర్ పేరును ఎవరూ చెరపలేరని అంటున్నారు.
కానీ అసలు జాతికి సమాజానికి ఆయనను ఎవరు దూరం చేశారని ప్రశ్నించారు.ఎన్టీఆర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా కృష్ణా జిల్లాకు సీఎం జగన్ ఎన్టీఆర్ పేరును పెట్టారని చెప్పారు.
అందుకు బాలకృష్ణ రుణపడి ఉండాలన్నారు.తండ్రి ఆఖరి కోరిక తీర్చలేని సన్నాసులు అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.