1.తిరుమల సమాచారం

తిరుమలలో భక్తుల రెడ్డి సాధారణంగా ఉంది.గురువారం తిరుమల శ్రీవారిని 70,674 మంది భక్తులు దర్శించుకున్నారు.
2.టీటీడీ కీలక ప్రకటన
సెప్టెంబర్ నెలకు సంబంధించిన ఆంగ్ల ప్రదక్షిణ టోకెన్ల ఆన్లైన్ కోటాను ఈనెల 22న విడుదల చేయనున్నట్లు టిటిడి ప్రకటించింది.
3.కేసిఆర్ కు బండి సంజయ్ సవాల్

తెలంగాణ సీఎం కేసీఆర్ కు ప్రజాస్వామ్యంపై గౌరవం ఉంటే ఇతర పార్టీల నుంచి టిఆర్ఎస్ లో చేర్చుకున్న వారితో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరారు.
4.కేసిఆర్ క్షమాపణలు చెప్పాలి
మునుగోడు ప్రజలకు తెలంగాణ సీఎం కేసీఆర్ క్షమాపణలు చెప్పిన తర్వాతే నియోజకవర్గంలో అడుగు పెట్టాలని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.
5.తెలంగాణలో అమిత్ షా పర్యటన షెడ్యూల్

మునుగోడులో జరగబోయే బిజెపి భారీ బహిరంగ సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా రేపు హాజరుకానున్నారు.ఈ మేరకు అమిత్ షెడ్యూల్ బిజెపి విడుదల చేసింది.
6.మిస్డ్ కాల్ ఉద్యమాన్ని ప్రారంభించిన కేజ్రీవాల్
ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా పై సీబీఐ దాడులు నిర్వహించగా… ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన జాతీయ మిషన్ లో చేరాలని కోరుతూ ‘ మిస్డ్ కాల్ ఉద్యమాన్ని ప్రారంభించారు.9510001000 కు మిస్డ్ కాల్ ఇవ్వాలని కేజ్రీవాల్ కోరారు.
7.మన మునుగోడు – మన కాంగ్రెస్ పోస్టర్ ఆవిష్కరణ

మన మునుగోడు – మన కాంగ్రెస్ పోస్టర్ ను తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.
8.భారత్ లో కరోనా
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 15, 754 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
9.మీడియా ఫోటోగ్రాఫర్లకు సన్మానం

నేడు అంతర్జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మీడియా ఫొటోగ్రాఫర్లకు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ సన్మానం చేయనున్నారు.
10.బంగాళాఖాతంలో అల్పపీడనం
తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం క్రమక్రమంగా బలపడుతోంది.రేపటికి వాయుగుండం గా మారి పశ్చిమ బెంగాల్ వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
11.20 నుంచి యాదాద్రిలో కృష్ణాష్టమి వేడుకలు

యాదాద్రిదీశుని అనుబంధ అలయమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం లో ఈ నెల 20 నుంచి కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించనున్నారు.
12.భద్రాచలంలో తగ్గుతున్న గోదావరి నీటిమట్టం
భద్రాచలంలో గోదావరి వరద ఉదృతి తగ్గుముఖం పట్టింది.
13.శ్రీవారి సేవలో జస్టిస్ ఎన్వీ రమణ

తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ తన కుటుంబ సభ్యులతో ఈరోజు దర్శించుకున్నారు.
14.ఏటా నాలుగుసార్లు ఓటరు నమోదు
ఓటరుగా నమోదు చేసుకోవడానికి 18 ఏళ్లు నిండిన వారికి ఏటా నాలుగుసార్లు అవకాశం ఇవ్వనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
15.అమరావతిలోనే ఏపీ రాజధాని

అమరావతిలోని ఏపీ రాజధాని కొనసాగుతుందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమ వీర్రాజు అన్నారు.
16.ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తులు
శ్రావణమాసం నాలుగో శుక్రవారం కావడంతో ఇంద్రకీలాద్రి పై భక్తులు పోటెత్తారు.
17.ధవలేశ్వరం వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక

తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం గోదావరి పై రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.
18.స్వచ్ఛంద బెయిల్ అవకాశాన్ని కోల్పోయిన ఎమ్మెల్సీ అనంతబాబు
తన కారు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న ఏపీ అధికార పార్టీ వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ అనంత్ బాబు స్వచ్ఛంద బెయిల్ పొందే అవకాశాన్ని కోల్పోయారు.
19.రేపు మునుగోడు లో టిఆర్ఎస్ బహిరంగ సభ

రేపు మునుగోడులో టిఆర్ఎస్ భారీ సభ నిర్వహించబోతున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,800 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 52,150
.