Akira Nandan: పండగ వేల ఓకే ప్రేమ్ లో మెగా ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్ గా అకీరా, ఆద్య!

రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద ఎత్తున సంక్రాంతి పండుగ సంబరాలు జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే.

తెలుగు వారికి అతి పెద్ద పండుగలలో సంక్రాంతి పండుగ ( Sankranthi Festival ) కూడా ఒకటి ఈ పండుగకు ఎక్కడెక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా పల్లెటూరికి వెళ్లి సంక్రాంతి పండుగలను చాలా ఘనంగా జరుపుకుంటారు.

ఇక మూడు రోజుల పాటు ఈ పండుగను ప్రతి ఒక్కరు కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు.ఈ క్రమంలోనే సాధారణ ప్రజల నుంచి మొదలుకొని సినీ సెలబ్రిటీల వరకు తమ సంక్రాంతి వేడుకలకు సంబంధించినటువంటి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ ఫ్యామిలీగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి మెగా ఫ్యామిలీ కూడా సంక్రాంతి సంబరాలను ఎంతో ఘనంగా జరుపుకుంటున్న విషయం మనకు తెలిసిందే వీరందరూ కూడా బెంగళూరులోని తమ ఫామ్ హౌస్ కి వెళ్లి అక్కడ ఈ వేడుకలను జరుపుకుంటున్నారు.

గత రెండు రోజులుగా మెగా ఫ్యామిలీలో జరుగుతున్నటువంటి సంక్రాంతి సంబరాలకు సంబంధించిన ఫోటోలు వీడియోలను మెగా కుటుంబ సభ్యులు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు.ఇకపోతే తాజాగా చిరంజీవి నుంచి మొదలుకొని లావణ్య ఉపాసన అల్లు స్నేహారెడ్డి వంటి వారందరూ కూడా తమ ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా మెగా ఫ్యామిలీ( Mega Family ) సంక్రాంతి వేడుకలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు.

Advertisement

ఇక ఈ ఫోటోలలో భాగంగా మెగా కుటుంబ సభ్యులందరూ కలిసి తెలుపు, ఎరుపు రంగు డ్రెస్ కోడ్ వేసుకొని మరి ఓకే ఫోటో దిగారు.ఇలా ఈ ఫోటో సోషల్ మీడియా( Social media )లో షేర్ చేస్తూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో మారింది.

ఈ ఫోటోలో మెగా కపుల్స్, పిల్లలు అందరూ ఓకే డ్రెస్ కోడ్ వేసుకొని కనిపించడంతో ఈ ఫోటో చాలా అట్రాక్టివ్ గా ఉంది.

ఇక ఇటీవల కాలంలో మెగా సెలబ్రేషన్స్ కి పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పిల్లలు అకిరా ఆద్య కాస్త దూరంగా ఉన్న సంగతి తెలిసిందే .వీరిద్దరూ నిహారిక పెళ్లి వేడుకలలో మెగా ఫ్యామిలీతో కలిసి కనిపించారు.అయితే తాజాగా సంక్రాంతి సంబరాలు సందర్భంగా ఈ వేడుకలలో అకిరా( Akhira ) ఆధ్య ( Aadhya ) ఇద్దరు కూడా పాల్గొని సందడి చేశారు.

ఈ ఫోటో ప్రేమ్ లో వీరిద్దరూ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.అయితే ఈ వేడుకలకు పవన్ కళ్యాణ్ దూరంగా ఉన్నారు.ఈయన ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాలలో బిజీగా ఉన్న నేపథ్యంలో తన ఫ్యామిలీ జరుపుకుంటున్నటువంటి సంక్రాంతి వేడుకలకు పవన్ కళ్యాణ్ దూరంగా ఉన్నారు.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు