గోవాలో ఫ్రెండ్స్‌ తో కలిసి రచ్చ చేస్తున్న మెగా డాటర్...!

లాక్ డౌన్ సమయం లో మెగా డాటర్ నిహారిక నిశ్చితార్థం కుటుంబ సభ్యుల మధ్యలో ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి అందరికీ తెలిసిందే.

జొన్నల గడ్డ చైతన్యతో ఆగస్టు నెలలో మెగా డాటర్ కొణిదెల నిహారికకు నిశ్చితార్థం జరిగింది.

ఈ మధ్యకాలంలో భర్తతో కలిసి సోషల్ మీడియాలో బాగా హడావిడి చేసేస్తుంది కొణిదెల నిహారిక.అంతే కాదు బయటికి ఎక్కడికి వెళ్ళినా సరే కాబోయే భర్తతో తెగ తిరుగుతూ ఎంజాయ్ చేస్తుంది.

సోషల్ మీడియాలో నిహారిక తన కాబోయే భర్త ను గట్టిగా హత్తుకున్న ఫోటోను షేర్ చేసి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.ఇకపోతే బయట ఎంత యాక్టీవ్ గా ఉంటుందో నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇక సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను మెగా అభిమానులకు తెలిసేలా పోస్ట్ చేస్తూనే ఉంటుంది. నిహారిక నిశ్చితార్థం రోజున కూడా చైతన్యతో కలిసి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.

Advertisement

ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా కూడా మారాయి.ఈ మధ్య కాలంలో కాబోయే భార్య భర్తలు ఇద్దరు జిమ్ కు వెళ్లడం, కలిసి వర్కౌట్స్ చేయడం లాంటి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అయితే తాజాగా తన కాబోయే భర్తను వదిలేసి కొణిదెల నిహారిక గోవాకు వెళ్ళిపోయింది.అయితే ఈ గోవా ట్రిప్ ఎందుకో తెలుసా.? అదేనండి మగవారు పెళ్లికి ముందు బ్యాచిలర్ పార్టీ ఇస్తారు కదా వారి స్నేహితులకు.అలాగే నిహారిక కూడా తన స్నేహితులకు బ్యాచిలర్ పార్టీని గోవాలో ఇస్తోందట.

అందుకోసం తన స్నేహితులతో కలిసి గోవాకు చెక్కేసింది.తాజాగా గోవాలో చేసిన రచ్చకు సంబంధించి ఫోటోలను షేర్ చేస్తోంది నిహారిక.

అయితే అక్కడికి వెళ్ళాక అమ్మడు ధరించే డ్రెస్సింగ్ సెన్స్ లో కూడా తేడా వచ్చేసింది అండోయ్.ఇక నిహారిక ఫ్రెండ్స్ ఆమెను ఆట పట్టిస్తూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు