యాంకర్: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్సించుకున్నారు.ఈ ఉదయం విఐపి విరామ సమయంలో యతిరాజ పీఠాధిపతి శ్రీ యతిరాజా జీయర్ స్వామి.
, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్., ఎంపీ బెల్లాని చంద్రశేఖర్., ఎమ్మెల్యే అప్పలనాయుడు., జనసేన పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్., ఎంపీ తేజస్వి సూర్య., కమెడియన్ కృష్ణ భగవాన్.
, చిట్టి బాబు., పాప్ కార్న్ మూవీ టీం అవిక గోర్.
, సాయి రోహిత్ లు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.
ఆలయం వెలుపల వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ….రథసప్తమి వేడుకలను టీటీడీ వైభవంగా నిర్వహించిందని చెప్పారు.
లక్షల మంది భక్తులు రథసప్తమి వేడుకల్లో పాల్గొని సంతృప్తి వ్యక్తం చేసారని అన్నారు.సంకల్పం మంచిది అయితే ఏదైనా సాధ్యమేనని అన్నారు.
జగన్ చేసాడు అని మనం చేస్తే సీఎం అవుతాము అనేది భ్రమ అని తెలిపారు.చిత్తశుద్ధి లేని పాదయాత్ర లోకేష్ ఎన్ని చేసిన వ్యర్ధమన్నారు.