తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.సోమవారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో వైసీపి ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సలహాదారుడు రాజారాం పాండేలు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.
దర్శనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.