ఇటీవలే కాలంలో మానవత్వం అనేది సమాజంలో ఎక్కడ కనిపించకుండా అంతరించిపోతోంది.నవ మాసాలు మోసిన తల్లిపై, ( Mother ) పుట్టినప్పటి నుండి పెళ్లయింతవరకు అన్నీ బాగోగులు బాధ్యతగా చూసుకునే తండ్రిపై పిల్లలకు ప్రేమ కరువైంది.
తల్లిదండ్రులను ఏ కష్టం రాకుండా చూసుకోవాల్సిన పిల్లలే దారుణంగా హత్యలు చేసి కాటికి పంపిస్తున్నారు.కుటుంబ సభ్యుల కంటే బయటి వ్యక్తులే నయం.కేవలం మోసం చేసి వదిలేస్తారు.కానీ కుటుంబ సభ్యులు అలా కాదు కాటికి పంపించేంతవరకు నిద్రపోరు.
తాజాగా ఓ వ్యక్తి తన భార్యతో కలిసి కన్నతల్లిని దారుణంగా హత్య చేసి, తనకేం తెలియనట్టుగా అమాయకంగా ప్రవర్తించి తప్పించుకునే ప్రయత్నం చేసిన సంఘటన వనపర్తి జిల్లాలో స్థానికంగా అందరినీ షాక్ కు గురిచేసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అమడ బాకుల గ్రామంలో రాములు- శివమ్మ అనే దంపతులు నివాసం ఉంటున్నారు.వీరికి వివాహం జరిగి చాలా సంవత్సరాలు అయింది.కానీ పెళ్లయిన ఒక సంవత్సరం పాటు సంతోషంగా ఉండే వీరి కుటుంబంలో చిన్నగా కోడలు శివమ్మకు-అత్త శంకరమ్మ కు గొడవలు మొదలయ్యాయి.
కొంతకాలం తర్వాత అత్తా-కోడల మధ్య గొడవలు సర్వ సాధారణంగా మారిపోయాయి.చుట్టుపక్కల వారు ఎంత సర్ది చెప్పినా గొడవలు మాత్రం తరచూ జరుగుతూ ఉండేవి.అయితే మంగళవారం ఉదయం ఒక్కసారిగా రాములు తల్లి శంకరమ్మ ( Shankaramma ) మృతదేహం నీటి సంపులో కనిపించడంతో ఆ గ్రామమంతా ఒక్కసారిగా షాక్ గురైంది.
గ్రామస్తులు కోపంతో రాములు- శివమ్మలను చితకబాది పోలీసులకు సమాచారం అందించారు.సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు శంకరమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదుతో రాములు-శివమ్మలపై( Ramulu Sivamma ) కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
ఇటువంటి నీచులకు సమాజంలో ఉండే అర్హత లేదని, ఇటువంటి వారిని కఠినంగా శిక్షిస్తే వేరేవాళ్లు ఇటువంటి దారుణాలకు పాల్పడరని గ్రామస్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.