Bulls Fight : భీకరంగా పొట్లాడుతున్న ఎద్దుల మధ్యలోకి వెళ్లాడు.. చివరికి ఏమైందో తెలిస్తే..

ఎక్కడైన రెండు ఎద్దులు పోట్లాడటం( Bulls Fighting ) చూస్తే ఎవరికైనా భయం వేస్తుంది.ఎందుకంటే వాటి కొట్లాట అంత భయంకరంగా ఉంటుంది.

సాధారణంగా రెండు భారీ జంతువులు గొడవకు దిగితే ఆ చుట్టు పక్కల ఉన్న వాళ్లంతా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాల్సిందే.అలా చెయ్యకపోతే వాటి మధ్య నలిగిపోతారు.

ప్రస్తుతం ఇలాంటి సంఘటనకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.రెండు ఎద్దులు గొడవ పడుతుంటే మధ్యలోకి వెళ్లిన వ్యక్తి తగిన మూల్యం చెల్లించాడు.

అనవసరమైన విషయంలో జోక్యం చేసుకుంటే ఎలా ఉంటుందో అనేదాని గురించి అనుభవించి మరీ తెలుసుకున్నాడు.

Advertisement

మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటనను @Dharmeshspandey అనే వ్యక్తి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.వైరల్ అవుతున్న ఆ వీడియోని మనం చూసినట్లయితే నడిరోడ్డు మీద రెండు ఎద్దులు కాయ్యానికి కాలు దువుతున్నాయి.అదే సమయంలో ఓ వ్యక్తి వాటి దగ్గరకు వెళ్లి హీరోయిజం ప్రదర్శించాలనుకున్నాడు.

ఒక ఎద్దు తోక పట్టుకున్నాడు.కానీ ఆ ఎద్దు ఆ వ్యక్తిని ఏ మాత్రం లెక్కచేయ్యలేదు.

దాంతో అతను వేరే ఎద్దు దగ్గరకు వెళ్లి దాని తోక పట్టుకున్నాడు.కొద్ది సేపు ఊరుకున్న ఆ ఎద్దు ఒక్కసారిగా వెనక్కి తిరిగి అతడిని దాని కొమ్ములతో ఎత్తి పడేసి అక్కడినుంచి పారిపోయింది.

ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్ జిల్లా రాజ్‌పురా( Burhanpur Rajpura ) అనే ప్రాంతంలో జరిగింది.ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియా( Social Media )లో షేర్ చెయ్యగా అది వైరల్‌గా మారింది.వేల మంది ఈ వీడియోను వీక్షించి తమ స్పందనలను తెలియజేశారు.

సమాధులు తవ్వి ఆడ శవాలపై అత్యాచారాలు చేస్తున్న పాక్ వ్యక్తి.. కట్ చేస్తే..?
ఎమ్మెల్సీ ఎన్నికలు : పోటీకి టీడీపీ దూరమేనా ? ఎటు తేల్చుకోలేకపోతున్నారా ? 

కొంతమంది శాంతి దూతగా వెళ్లి గాల్లోకి ఎగిరిపోయాడు అని కామెంట్ చేస్తే ,మరికొందేమో భల్లాల దేవుడికి తగిన శాస్తి జరిగింది అని అంటున్నారు , ఇంకొంతమందేమో గొడవ ఆపడానికి వచ్చిన ఆ మంచి వ్యక్తితో ఎద్దులు అంత దురుసుగా ప్రవర్తించడం తప్పు కదా అంటూ ఫన్నీ కామెంట్లు చేశారు.

Advertisement

తాజా వార్తలు