కరోనాతో వ్యక్తి మృతి.. అంత్యక్రియలు చేసిన ఎమ్మెల్యే

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి.కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్య కూడా గణనీయంగా ఉంది.

 Ap, Chittoor, Mla, Attend,funeral-TeluguStop.com

కరోనా చికిత్స పొందుతున్నా.కరోనాతో మరణించినా ఇబ్బందులు తప్పడం లేదు.

కరోనా వల్ల బంధాలు, బంధుత్వాలు దూరమయ్యాయి.మానవత్వం మంటగలిసింది.

కరోనా వల్ల, లేదా కరోనా సోకే మరణించాడనే అనుమానంతో అంత్యక్రియలకు కూడా నోచుకోని పరిస్థితి.కుటుంబ సభ్యులు కూడా అంత్యక్రియలు నిర్వహించేందుకు వెనకడుగేస్తున్నారు.

ఇలాంటి ఘటనలు రోజు చూస్తునే ఉన్నాం.అయితే చిత్తూరు జిల్లాలో గ్రామమే ఏకమై కరోనాతో మరణించిన వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించింది.

చిత్తూరు జిల్లాలోని తిరుపతి రూరల్ పేరూరు గ్రామస్థులు కరోనాతో చనిపోయిన మాజీ సర్పంచ్ బచ్చల గురువారెడ్డిని ఊరి మధ్యలో ఉన్న శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించడానికి తీసుకెళ్తున్నారు.విషయం తెలిసి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అక్కడికి చేరుకుని బాధితుడి స్ట్రెచర్ ఎత్తుకుని శ్మశానవాటికకు తరలించారు.

అనంతరం అక్కడ అంత్యక్రియలు చేశారు.గ్రామం మధ్యలో అంత్యక్రియలు నిర్వహించినందుకు ఎమ్మెల్యే గ్రామస్థులను అభినందించాడు.

పేరూరు గ్రామ ప్రజలను చూసి పలు గ్రామాలు, పట్టణాలు ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ మేరకు గురువారెడ్డి కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతిని అందించారు.

పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని తెలిపాడు.కరోనాతో మరణించిన వ్యక్తి స్ట్రెచర్ మోసిన ఎమ్మెల్యేను చూసి పలువురు ప్రజాప్రతినిధులు అభినందించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube