ఎన్నారైల కోసం కీలక చట్టం సవరణ..!!

శంలో ఏ ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ పని ఎలా జరుగుతుందో తెలుసుకోవాలన్నా.ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయాలు తెలుసుకోవాలన్నా.

అసలు పభుత్వంలో జరిగే పతీ పనికి సంభందించిన విషయాలు తేటతెల్లం అవ్వాలన్నా సరే సమాచార హక్కు చట్టం ద్వారానే బహిర్ఘతం అవుతుంది.అయితే ఇది కేవలం భారత దేశంలో ఉంటున్న భారతీయులకి మాత్రమే వర్తిస్తుంది అయితే ఇదంతా నిన్నటి వరకూ

గతంలో కేవలం భారతీయులకి మాత్రమే వర్తించే ఈ చట్టం ఇప్పుడు విదేశాలలో ఉంటున్న భారతీయులకి కూడా ఈ చట్టం వర్తించేలా కేంద్రం సవరణలు చేసింది అందుకు గాను కీలక నిర్ణయంపై సవరణలు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.విదేశాల్లో ఉంటున్న భారతీయులు (ఎన్‌ఆర్‌ఐలు) కూడా సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద ప్రభుత్వ విభాగాలను సమాచారం కోరవచ్చని కేంద్రం తాజాగా స్పష్టం చేసింది.

ఆర్టీఐ చట్టం ప్రకారం భారతీయులందరికీ ఆ అవకాశం ఉంటుందనీ, ఎన్‌ఆర్‌ఐలు కూడా భారతీయులేనంటూ లోకేశ్‌ బాత్రా అనే సామాజిక కార్యకర్త మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు.దాంతో జితేంద్ర సింగ్‌ ఇచ్చిన సమాచారాన్ని మార్చి, ఆ సమాధానాన్ని ప్రభుత్వం మళ్లీ లోక్‌సభ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసింది.ఎన్నారైలు ఇక నుంచీ ఎక్కడ ఉన్నా సరే ఈ సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకోవచ్చని తెలిపింది కేంద్రం.

Advertisement
ఫ్లైట్ పైనుంచి కిందపడ్డ పెద్ద మంచు ముద్ద.. దేనిపై పడిందో తెలిస్తే..?
Advertisement

తాజా వార్తలు