గుంటూరు కారం రూమర్లకు చెక్ పెట్టిన మహేష్... విడుదల అయ్యేది అప్పుడే అంటూ?

సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న గుంటూరు కారం( Gunturu Kaaram ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.

ఈ సినిమా గత ఏడాది షూటింగ్ పనులను ప్రారంభించినప్పటికీ షూటింగ్ పనులు మాత్రం చాలా నత్త నడకన సాగుతున్నాయి.

దీంతో ఈ సినిమా వచ్చేయడాది సంక్రాంతికి విడుదల కాకపోవచ్చు అనే సందేహాలు అందరిలోనూ నెలకొన్నాయి.అదేవిధంగా ఈ సినిమా గురించి ఎన్నో రకాల వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చాయి.

మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ మధ్య గొడవ జరిగిందని తమన్ కూడా ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నారంటూ ఈ సినిమా గురించి తరచూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.

ఇలా ఈ సినిమా గురించి ఎన్నో రకాల రూమర్స్ వస్తున్నటువంటి తరుణంలో తాజాగా గుంటూరు కారం సినిమా గురించి మహేష్ బాబు మొదటిసారి స్పందిస్తూ ఈ రూమర్స్ అన్నింటికీ చెక్ పెట్టారు.ఈ సినిమా గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్న ఎప్పుడు కూడా స్పందించండి మహేష్ బాబు మొదటిసారి ఈ సినిమా గురించి వస్తున్న రూమర్లపై స్పందించారు.హైదరాబాదులో ఓ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మహేష్ బాబు ఈ సినిమా విడుదల తేదీ ( Release Date ) గురించి క్లారిటీ ఇచ్చారు.

Advertisement

ఈ సినిమా ముందుగా అనుకున్న ప్రకారమే 2024 సంక్రాంతి పండుగ సందర్భంగా పక్కాగా విడుదల కాబోతుందని ఈయన తెలియజేశారు.

వచ్చే ఏడాది జనవరి 12వ తేదీ ఈ సినిమా తప్పకుండా విడుదలవుతుందని మీరందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు అంటూ ఈయన ఈ సినిమా విడుదల తేదీ గురించి క్లారిటీ ఇవ్వడంతో మహేష్ బాబు అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.హైదరాబాదులో యాక్షన్స్ సన్ని వేషాలను చిత్రీకరించడం కోసం దాదాపు నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రత్యేకంగా సెట్ వేశారని ఇక్కడే ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుందని తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు