ఆర్.ఆర్.ఆర్, కె.జి.ఎఫ్ 2 సూపర్ హిట్ కొట్టగా ఆ తర్వాత వచ్చిన మెగా ఆచార్య ఆడియెన్స్ అంచనాలను అంద్దుకోలేకపోయాడు.ఆడియెన్స్ ఇంకా ఆ రెండు సినిమాల ఫీవర్ లోనే ఉండగా కొరటాల శివ స్లో నరేషన్ తో వచ్చిన ఆచార్య ఆడియెన్స్ కి ఎక్కలేదు.
ఇక ఈ టైం లో సర్కారు వారి పాట సినిమాతో వస్తున్నాడు సూపర్ స్టార్ మహేష్.పరశురాం డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది.
థమన్ మ్యూజిక్ సినిమాపై ఇప్పటికే అంచనాలు పెంచాయి.
టీజర్, ట్రైలర్ అన్ని సినిమాపై సూపర్ క్రేజ్ తీసుకురాగా సర్కారు వారి పాట సినిమాతో మహేష్ అనుకున్న రేంజ్ హిట్ కొడితే మాత్రం లెక్క వేరేగా ఉంటుందని అంటున్నారు.
అన్ని పాజిటివ్ ఎలిమెంట్స్ తో సర్కారు వారి పాట వస్తుంది.పోకిరి సినిమాలో మహేష్ ని తలపించేలా సర్కారు వారి పాట సినిమాలో మహేష్ పాత్ర ఉందని తెలుస్తుంది.
మరో ట్రిపుల్ ఆర్, కె.జి.ఎఫ్ 2 తర్వాత ఆ రేంజ్ హిట్ అందుకునే సినిమా సర్కారు వారి పాట అవుతుందా లేదా అన్నది మరో నాలుగు రోజుల్లో తెలుస్తుంది.