మహేష్- త్రివిక్రమ్ 'SSMB28' ఫస్ట్ లుక్ అప్పుడే రాబోతోందా?

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా ఇటీవలే గ్రాండ్ గా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

మహేష్ బాబు ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు.

ఈ క్రమంలోనే ఈ సినిమా నుండి ఏదొక అప్డేట్ వస్తూనే ఉంది.త్రివిక్రమ్ అల వైకుంఠపురంలో సినిమా తర్వాత మరో సినిమా చేయలేదు.దీంతో ఇప్పుడు చేసే సినిమా గ్యాప్ లేకుండా చేయాలని అనుకున్నాడు.11 ఏళ్ల తర్వాత వీరి కలయికలో సినిమా రాబోతుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.జులై నెలలో సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం అందుతుంది.

ఈ సినిమాను వచ్చే సంక్రాంతిని రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు.ఇక ఇందులో మహేష్ కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.

హారిక హాసిని బ్యానర్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Advertisement

ఇక ఈ సినిమాలో మహేష్ బాబు ద్విపాత్రాభినయం చేస్తున్న విషయం విదితమే.SSMB28 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.ఇది ఇలా ఉండగా ఈ సినిమా నుండి తాజాగా మరొక వార్త నెట్టింట వైరల్ అయ్యింది.

ఈ కాంబో కోసం ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ప్రేక్షకులు సెట్స్ మీదకు వెళ్లకుండానే ఇది బ్లాక్ బస్టర్ హిట్ అని తేల్చేసారు.తాజాగా ఈ సినిమా గురించి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఫస్ట్ లుక్ అప్ డేట్ ఆగష్టు 9న రాబోతుందట.

మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆగష్టు 9న ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ రానుందని తాజాగా టాక్ వచ్చింది.ఇదే కనుక నిజం అయితే మహేష్ ఫస్ట్ లుక్ వస్తే ఫ్యాన్స్ కు పండగ అనే చెప్పాలి.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు