'గెట్ వెల్ సూన్ అన్న' అంటూ మహేష్ కు స్టార్స్ వరుస ట్వీట్స్!

న్యూ ఇయర్ వేడుకల కోసం సెలెబ్రిటీలు అందరు విదేశాలకు పయనం అయినా విషయం తెలిసిందే.ఆ లిస్టులో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఉన్నారు.

మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి న్యూ ఇయర్ వేడుకల కోసం దుబాయ్ వెళ్లిన విషయం తెలిసిందే.ఈయన వారం రోజుల పాటు దుబాయ్ లో తన ఫ్యామిలీతో కలిసి గడిపి ఇటీవలే హైదరాబాద్ కు చేరుకున్నారు.

మహేష్, ఆయన కుటుంబం ఇక్కడికి వచ్చిన వెంటనే కరోనా టెస్ట్ చేసుకున్నారు.ఇందులో మహేష్ బాబు కు పాజిటివ్ అని వచ్చిందని ఇంకా ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కోవిడ్ టెస్ట్ రిజల్ట్స్ రాలేదు అని తెలిసింది.

మరికొన్ని గంటల్లో ఈ విషయం వెల్లడి అవుతుందని సమాచారం.మహేష్ రిపోర్ట్స్ రాగానే మహేష్ తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని నిన్న రాత్రి సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

Advertisement

సూపర్ స్టార్ ప్రకటించినప్పటి నుండి ఆయన త్వరగా కోలుకోవాలని టాలీవుడ్ సెలెబ్రిటీలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

సెలెబ్రిటీలతో పాటు అభిమానులు కూడా మహేష్ తొందరగా కోలుకోవాలని పోస్టులు పెడుతున్నారు.చిరంజీవి, ఎన్టీఆర్, సాయిధరమ్ తేజ్, అనిల్ రావిపూడి వంటి స్టార్స్ ఆయన త్వరగా కోలుకోవాలని కోరుతూ గెట్ వెల్ సూన్ అన్న అంటూ మహేష్ కోసం కోరుకుంటున్నారు.

ఇక మహేష్ సినిమాల విషయానికి వస్తే ఆయన ప్రసెంట్ పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమాలో మహేష్ కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తుంది.మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఎస్ థమన్ సంగీతం అందించగా ఈ సినిమాను ఏప్రిల్ 1, 2022 న విడుదల కానుంది.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు