గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ ''ఓ మై బేబీ''కు టైం ఫిక్స్.. ప్రోమో ఎప్పుడంటే?

సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahesh Babu ) నుండి నెక్స్ట్ రాబోతున్న మూవీ గుంటూరు కారం.

మాస్ మసాలా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ తో పాటు తెలుగు ఆడియెన్స్ మొత్తం ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.

ఎందుకంటే మహేష్, త్రివిక్రమ్ కాంబోలో ఈ సినిమా తెరకెక్కుతుంది కాబట్టి ఈ సినిమా కోసం ఆడియెన్స్ లో భారీ హైప్ నెలకొంది.మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మాస్ యాక్షన్ మూవీ గుంటూరు కారం( Guntur Karam ).మరో నెల రోజుల్లో సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా ఈ సినిమాను రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.దీంతో మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది.

ఈ క్రమంలోనే ఇటీవలే ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేసిన మేకర్స్ తాజాగా ఈ సినిమా సెకండ్ సింగిల్ గురించి అప్డేట్ ఇచ్చారు.ఎప్పుడెప్పుడా అని ఈ సాంగ్ కోసం అంత ఎదురు చూస్తుండగా కొద్దిసేపటి క్రితం పోస్టర్ తో రివీల్ చేశారు.ఓ మై బేబీ అంటూ సాగే ఈ సాంగ్ ఈ రోజు సాయంత్రం 4 గంటల 5 నిముషాలకు ప్రోమో రిలీజ్ చేయనున్నారు.

అలాగే ఫుల్ సాంగ్ ను డిసెంబర్ 13న రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.ఎట్టకేలకు సాంగ్ అప్డేట్ రావడంతో ఈ సాంగ్ కోసం ఎదురు చూస్తున్నారు.మహేష్, శ్రీలీలపై రొమాంటిక్ సాంగ్ గా ఉండబోతున్నట్టు తెలుస్తుంది.

Advertisement

ఈ న్యూస్ విని ఫ్యాన్స్ తెగ సంతోష పడుతున్నారు.ఇదిలా ఉండగా ఈ సినిమాలో శ్రీలీల,( Sreeleela ) మీనాక్షి చౌదరి( Meenakshi Chaudhary ) హీరోయిన్ లుగా నటిస్తుండగా హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ ఈసినిమాను నిర్మిస్తున్నారు.

థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది.

Advertisement

తాజా వార్తలు