టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) గత ఏడాది తన కుటుంబంలో విషాదాలు చోటు చేసుకోవడంతో ఎంతో కృంగిపోయారు.గత ఏడాది మొదటి నుంచి వరుసగా తన అన్నయ్య రమేష్ బాబు తల్లి ఇందిరాదేవి తండ్రి కృష్ణ ముగ్గురు వరుసగా మరణించడంతో ఘట్టమనేని కుటుంబ సభ్యులు ఈ విషాదం నుంచి కోలుకోలేకపోయారు.
ఇలా వరుస మరణాలు మహేష్ బాబుని ఎంతగానో కృంగదీసాయని చెప్పాలి.ఇలా గత ఏడాది మొత్తం విషాదాలతో నిండిపోయిన మహేష్ బాబుకు ఈ ఏడాది మంచి జరగాలని అభిమానులందరూ కోరుకున్నారు.
ఈ క్రమంలోనే ఈయన తన తదుపరి సినిమాల షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.
ఇకపోతే మహేష్ బాబుకు తన తల్లి ఇందిరా దేవి (Indira Devi)అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తన మనసు బాగా లేకపోయినా తన సినిమా ఏదైనా విడుదలవుతున్న తన తల్లి వద్దకు వెళ్లి తనతో మాట్లాడి తన చేతి కాఫీ తాగితే తనకు చాలా ప్రశాంతంగా ఉంటుంది అంటూ గతంలో తన తల్లితో తనకు ఉన్న అనుబంధం గురించి తెలియజేశారు.అయితే తన తల్లి మరణించిన తర్వాత మొదటిసారి తన పుట్టినరోజు రావడంతో మహేష్ బాబు తన తల్లిని తలుచుకొని సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు.
ఈ క్రమంలోనే మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా తన అమ్మ ఇందిరా దేవిని గుర్తు చేసుకుంటూ తనతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ… పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ… ప్రతిరోజు నీకు కృతజ్ఞుడిని అంటూ ఈయన ఎమోషనల్ అయ్యారు.ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.ఇక మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే గత ఏడాది సర్కారు వారి పాట సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు.ఈ సినిమా అనంతరం ఈయన రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో రాబోయే సినిమాతో బిజీ కానున్నారు.