కూతురితో సరదాగా గడుపుతున్న మహేష్.. ఫోటో షేర్ చేసిన నమ్రత!

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు "సర్కారు వారి పాట" సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు.ఇటీవల మహేష్ బాబు కరోనా నుండి కోలుకున్నారు.

సర్కారు వారి పాట సినిమా 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకోగా మిగిలిన 40 శాతం షూటింగ్ మిగిలి ఉంది.అన్ని పనులు సక్రమంగా జరిగి ఉంటే ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల అయ్యేది.

కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది.తాజాగా మహేష్ బాబు కరోనా నుండి కోలుకున్న వెంటనే ఆయన సోదరుడు రమేష్ బాబు మృతి చెందారు.

ఆ సంఘటన వల్ల సినిమా షూటింగ్ మళ్లీ వాయిదా పడింది.మహేష్ బాబు పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఆయన ఎంతో రిజర్వుడ్ గా ఎటువంటి వివాదాలలో తల దూర్చకుండ తన పని తాను చేసుకుపోతుంటారు.

Advertisement

మహేష్ బాబు తన కుటుంబం కోసం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తాడు.సినిమా షూటింగ్ ఉన్నప్పుడు సెట్ లో, షూటింగ్ లేని సమయంలో తన కుటుంబంతో టైం స్పెండ్ చేస్తారు.

షూటింగ్ లేని సమయంలో ఆయన కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లి వెకేషన్ ఎంజాయ్ చేస్తారు.

మహేష్ బాబు ఎప్పుడు తన కుటుంబం లేకుండా ఒంటరిగా కనిపించిన సందర్భాలు లేవు.మహేష్ బాబు తన పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తున్న మూమెంట్స్ ని ఆయన భార్య నమ్రత ఎప్పటికప్పుడు ఫోటోలు తీసి ఆ మెమోరీస్ నీ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటారు.మహేష్ బాబు ఈ మధ్య కాలంలో కొన్ని అనివార్య కారణాల వల్ల షూటింగ్ లేక ఇంట్లో ఉండవలసి వచ్చింది.

ఆ సమయంలో మహేష్ బాబు పిల్లలతో ఎంజాయ్ చేశారు.తాజాగా తన కుమార్తె సితార, మహేష్ బాబు తమ పెట్ డాగ్ తో ఆడుకుంటుండగా నమ్రత ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతోమంది మహేష్ అభిమానులను ఆకట్టుకుంది.

Advertisement

తాజా వార్తలు