తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొడుకు నారా లోకేష్ యువగళం ఘనంగా ప్రారంభమైంది.
అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి అనేక ఇబ్బందులు ఎదుర్కొని చివరికి చంద్రబాబు నాయుడు నియోజకవర్గం అయిన కుప్పం లో ఈ యాత్రను ప్రారంభించారు.
ఇక టిడిపి కార్యకర్తలు కూడా ఎంతోమంది ఉత్సాహంగా లోకేష్ కు ఘనంగా ఆహ్వానం పలికారు.అయితే తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుతూ లోకేష్ వైయస్ జగన్ పై ఎన్నో విమర్శలు చేశారు.
వీటిలో ఎన్నో రోజులు తన యువగళాన్ని అడ్డుకున్న జీవో1 గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు.
జీవో 1 ప్రకారం ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి ర్యాలీలు, సభలు నిర్వహించకూడదని ఆదేశాలు జారీ చేసింది.అయితే దీనిపై హైకోర్టు స్టే విధించింది.దీంతో యువగళం ముందుకు సాగింది.
ఈ విషయంలో వైసీపీపై పై చేయి సాధించిన లోకేష్ ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డిని సైకో రెడ్డిగా పేర్కొంటూ ఈ జీవో ని మడిచి ఎక్కడ పెట్టుకుంటారో పెట్టుకోండి అని తీవ్రమైన విమర్శలు చేశాడు.అయితే ఇక్కడ అన్నిటికంటే ఆసక్తికరంగా అనిపించింది ఏమిటంటే.
పవన్ కళ్యాణ్ తరుపున కూడా లోకేష్ కామెంట్ చేయడం.“మీరు ఏం చేసినా వారాహి ఆగదు, యువగళం ఆగదు అనేశాడు”.
పవన్ కళ్యాణ్ ప్రచార వాహనం వారాహిపై వైసీపీ నాయకులు చేసిన రచ్చ తెలిసిందే.అయితే పవన్ మాత్రం వారాహిని విజయవాడకి తెచ్చి మరీ పూజలు చేసి ప్రారంభించారు.
కానీ జనసేన పార్టీ వాహనానికి లోకేష్ ప్రచారం చేయడం ఏమిటని పలువురు ఆశ్చర్యపోయారు.పవన్ ఈమధ్య చంద్రబాబుతో సన్నిహితంగా నిలవడం, అలాగే బిజెపి వారికి దూరం కావడంతో పాటు లోకేష్ ఇలా నేరుగా ప్రజల్లో జనసేన పార్టీ తరఫున కూడా తానే ప్రచారం చేయడం కొంతమందికి విడ్డూరంగా తోచింది.అయితే ఈ సంఘటనలన్నీ టిడిపి-జనసేన పొత్తుని ఖరారు చేస్తున్నాయని స్పష్టం అవుతోంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002[email protected]Ph No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy