కొండూరిని కలిసిన ఎల్లారెడ్డిపేట నాయకులు

రాజన్న సిరిసిల్ల జిల్లా : టెస్కాబ్ ఛైర్మెన్ పదవికి రాజీనామా చేసిన కొండూరు రవీందర్ రావును ఎల్లారెడ్డిపేట మండల జెడ్పి్టిసి చీటీ లక్ష్మణ్ రావు, ప్యాక్స్ ఛైర్మెన్ గుండారపు కృష్ణారెడ్డి, ఏ ఎంసి మాజీ ఛైర్మెలు కొండ రమేష్ గౌడ్, అందె శుభాష్ లు శుక్రవారం కలిశారు.

కరీంనగర్ డిసిసిబి ఛైర్మెన్ స్థాయి నుండి టెస్కాబ్, నాబ్కాబ్ చైర్మన్ పదవులు పొందిన కొండూరు రవీందర్ రావు సహకార బ్యాంకుల బలోపేతానికి విశేషంగా కృషి చేశారని తద్వారా వ్యవసాయ పరపతి సంఘాలలో సభ్యులయిన రైతులు ఎన్నో విధాలుగా అభివృధి చెందడం జరిగిందని జడ్పిటీసి చీటీ లక్ష్మణ్ రావు, ప్యాక్స్ ఛైర్మెన్ కృష్ణారెడ్డి లు కొనియాడారు.

కొండూరును కలిసిన వారిలో వర్ష కృష్ణహరితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.

అధికారి వేధింపులు పంచాయతీ కార్యదర్శి ఆత్మ హత్య యత్నం

Latest Rajanna Sircilla News