పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు

సినిమా హాల్స్ లో సినిమా ప్రారంభానికి ముందు జాతీయగీతం ఖచ్చింతంగా స్క్రీన్ చేయాలని, హాలులో ఉండే ప్రేక్షకులు ఖచ్చితంగా లేచి నిల్చోని, జాతీయగీతాన్ని గౌరవించాలని ఇటివలే సుప్రీమ్ కోర్టు ఆర్డర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఈ నిర్ణయానికి మిశ్రమ స్పందన వచ్చింది.

అదే కోవలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా సుప్రీంకోర్టు నిర్ణయాన్ని తప్పుబడుతూ తన ట్విట్టర్ ఖాతా ద్వారా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.పవన్ కళ్యాణ్ ట్వీట్స్ ని వ్యతిరేకిస్తూ, హైదరాబద్ హైకోర్టు లాయర్ ఒకరు పవన్ కళ్యాణ్ పై కేసు వేశారు.

సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో పవన్ కళ్యాణ్ పై కేసు నమోదయ్యింది.పవన్ కళ్యాణ్ తన ట్వీట్స్ ద్వారా ఇటు జాతీయ గీతాన్ని, అటు సుప్రీంకోర్టుని అవమానించారని, ప్రజలను తన వాక్యాలతో తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేశారనే అభియోగాలు పవన్ కళ్యాణ్ కేసులో నమోదయ్యాయి.

వీటి సంగతేంటి ? కూల్చివేతలపై బీఆర్ఎస్ ఫైర్
Advertisement

తాజా వార్తలు