లేటెస్ట్ బజ్.. 'ఆదిపురుష్' షూట్ లో ప్రభాస్ ?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరసపెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాధేశ్యామ్ సినిమాలో నటిస్తున్నాడు.

ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే సలార్, ఆది పురుష్ సినిమాలు ప్రకటించి ఇప్పటికే షూటింగ్ కూడా ప్రారంభించేసారు.రాధేశ్యామ్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న ఆదిపురుష్ షూట్ పై లేటెస్ట్ బజ్ ఒకటి వినిపిస్తుంది.ఆదిపురుష్ సినిమాను ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఆదిపురుష్ సినిమా రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతుంది.ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా నటిస్తున్నారు.

Advertisement

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 35 శాతం పూర్తి చేసుకుంది.తర్వాత కరోనా కారణంగా ఈ సినిమా షూట్ ను వాయిదా వేశారు.

అయితే మొన్నటి వరుసకు ప్రభాస్ సలార్ షూటింగ్ లో పాల్గొంటూ బిజీగా గడిపాడు.తాజాగా నిన్న ప్రభాస్ ఆదిపురుష్ షూటింగ్ లో పాల్గొన్నట్టు తెలుస్తుంది.అంతేకాదు ప్రభాస్ కృతి సనన్ మీద కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.

అంతేకాదు ఈ సన్నివేశాలను భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో బ్లు మాట్స్ వేసి చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తుంది.

సెప్టెంబర్ నెల మొత్తం ప్రభాస్ ఆదిపురుష్ షూటింగ్ లోనే పాల్గొన బోతున్నట్టు టాక్ వినిపిస్తుంది.కొన్ని రోజులుపాటు కీలక సన్నివేశాలను షూట్ చేయబోతున్నారట.ఇది ఇలా ఉంటే.

ఆ యాంకర్లు బూతులు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో పాపులర్.. వింధ్య షాకింగ్ కామెంట్స్ వైరల్!
వదిన సురేఖ వద్ద రెండు కోట్లు అప్పు తీసుకున్న పవన్ కళ్యాణ్.. ఆస్తుల చిట్టా ఇదే?

ఈ సినిమాను టి సిరీస్ సంస్థ 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.ప్రభాస్ అటు సలార్ సినిమా షూటింగ్ పూర్తి చేస్తూనే మధ్యలో ఆదిపురుష్ షూట్ లో పాల్గొంటున్నాడు.

Advertisement

అంతేకాదు రాధేశ్యామ్ సినిమా కూడా మరి కొద్దీ భాగం మాత్రమే ఉంది.మొత్తానికి ప్రభాస్ ఒకేసారి మూడు సినిమాల షూటింగ్ పూర్తి చేస్తున్నాడు.

తాజా వార్తలు