లేటెస్ట్ బజ్.. 'ఆదిపురుష్' లో గ్రాఫిక్స్ కే అంత సమయం తీసుకుంటారట !

బాహుబలి సినిమాతో తెలుగు సినిమాను ప్రపంచ వ్యాప్తంగా పరిచయం చేసిన ప్రభాస్ ఈ సినిమా తర్వాత వరస పెట్టి అన్ని పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు.

బాలీవుడ్ హీరోలు సైతం ప్రభాస్ మార్కెట్ ను చూసి ఆశ్చర్య పోతున్నారు.

ప్రస్తుతం ప్రభాస్ చేతిలో మూడు పాన్ ఇండియా సినిమాలతో పాటు ఒక పాన్ వరల్డ్ సినిమా ఉంది.అందులో ఆదిపురుష్ ఒకటి.

ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ ఆదిపురుష్ సినిమా తెరకెక్కుతుంది.ఇప్పటికే 30 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.రామాయణం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఈ సినిమాను విజువల్ వండర్ గా తెరకెక్కిస్తున్నారు.అయితే ఈ సినిమా గురించి లేటెస్ట్ బజ్ ఒకటి సోషల్ మీడియాలో గట్టిగ వినిపిస్తుంది.

Advertisement

ఈ సినిమాలో విజువల్ గ్రాఫిక్స్ ఎక్కువుగా ఉండబోతున్నాయి.ఈ నేపథ్యంలో ఈ సినిమా పూర్తి అయిన తర్వాత విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ కోసమే దాదాపు 10 నెలల సమయం తీసుకోబోతున్నారని తాజాగా వస్తున్న రూమర్.

అయితే ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే మాత్రం మరికొంత సమయం వేచి ఉండాల్సిందే.ఇది ఇలా ఉంటే.

ఈ సినిమాను టి సిరీస్ సంస్థ 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీత గా, సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడి గా నటిస్తున్నారు.ఈ సినిమాతో పాటు ప్రభాస్ కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో సలార్ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
నాగార్జున 100 వ సినిమా కథను అందిస్తున్న యంగ్ రైటర్స్...

అంతేకాదు రాధా కృష్ణ దర్శకత్వంలో రాధే శ్యామ్ సినిమా కూడా చేస్తున్నాడు.ఇందులో పూజ హెగ్డే ప్రభాస్ కు జోడీగా నటిస్తుంది.

Advertisement

ప్రస్తుతం ప్రభాస్ సలార్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు.

తాజా వార్తలు