అల వైకుంఠపురంలో టీం పై క్రిమినల్ కేసు నమోదు....

ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో అల వైకుంఠ పురం లో అనే చిత్రంలో నటిస్తున్నాడు.

ఈ చిత్రంలో బన్నీ సరసన పూజా హెగ్డే, నివేదా పేతురాజ్, కథానాయకులుగా నటిస్తుండగా, టబు, మురళి శర్మ, సునీల్, అక్కినేని హీరో సుశాంత్, నవదీప్, సముద్రఖని వంటి వారు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.

అయితే తాజాగా ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ మ్యూజికల్ కన్సర్ట్  పార్టీ పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు.అయితే ఇందుకుగానూ పోలీసులతో అనుమతి తీసుకునే సమయంలో ఈవెంట్ నిర్వాహకులు తప్పుడు సమాచారం ఇచ్చినందుకు గానూ ఈ చిత్ర యూనిట్ సభ్యుల పై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు.

ఇందులో భాగంగా మొదటిగా ఈ కార్యక్రమాన్ని రాత్రి 10 గంటల లోపు ముగిస్తామని అంతేగాక ఈ కార్యక్రమానికి 5 వేల నుంచి ఆరువేల మంది మాత్రమే వస్తారని చెప్పి పోలీసులతో అనుమతులు తీసుకున్నారు.అయితే ఈ నిర్వాహకులు చెప్పిందొకటి అక్కడ జరిగింది ఇంకోటి.రాత్రి 10 గంటలకి కార్యక్రమాన్ని ముగిస్తామని చెప్పి 11:30గంటల వరకు కొనసాగించారని అంతేగాక ఈ కార్యక్రమానికి సుమారు 15 వేల మంది అభిమానులు వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. దీంతో తప్పుడు సమాచారం ఇచ్చినందుకు గాను అల వైకుంఠ పురంలో టీం సభ్యులపై క్రిమినల్ కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

అయితే ఇది ఇలా ఉండగా ఈ చిత్రం 12 వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది. .

Advertisement
జగన్ తప్పు తెలుసుకున్నారా ? ప్రక్షాళన కు సిద్ధమా ? 

తాజా వార్తలు